Husband-Wife: ఈ మధ్యకాలంలో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు చాలా పెద్దగా అవుతున్నాయి. ప్రతి చిన్న విషయంలో గొడవ పడి విడాకుల వరకు, ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అయితే మామూలుగా భర్తలు వేధిస్తున్నారు అని భార్యలు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేస్తుంటారు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం సీన్ మొత్తం రివర్స్ అవుతుంది. భార్యలు వేధిస్తున్నారు అని భర్తలు పోలీస్ స్టేషన్ కి వెళ్లే పరిస్థితి వస్తుంది. తాజాగా ఇటువంటి ఘటన ఓ దగ్గర చోటుచేసుకుంది. ఇంతకు అసలు విషయం ఏంటో తెలుసుకుందాం..
మైసూరు వివిపురం పరిధిలో విజయనగరంలో ఎం రఘు కారియప్ప, జాస్మిన్ అనే భార్యాభర్తలు నివసిస్తున్నారు. ఇక జాస్మిన్ టీచర్ గా పని చేస్తుంది. అయితే భర్త రఘు తన భార్య కథ ఐదు సంవత్సరాల నుండి వేధిస్తుంది అని అంతేకాకుండా పలుసార్లు హత్యాయత్నం చేసింది అని పోలీసులకు తెలిపాడు. అంతేకాకుండా ఈ ఏడాది ఏప్రిల్ 15న ఆరు బంగారం ఉంగరాలు, బంగారు నాణేలు 2, ఒక బంగారం చైన్, పెద్ద గాజునుతన భార్య జాస్మిన్ దొంగలించింది అని తెలిపాడు.
ఆ నగలు ఎక్కడ అని అడిగితే తనే తీసుకున్నట్లు తెలిపిందని తెలిపాడు. దీంతో రఘు తిరిగి అడిగితే ఇవ్వడంలేదని.. దయచేసి నా వస్తువులు నాకు ఇప్పించాలి అని పోలీసులను కోరగా పోలీసులు ఈ విషయం గురించి పట్టించుకోకుండా వదిలేశారు. దీంతో అతడు నేరుగా కోర్టులో కేసు వేయగా ఈ కేసును వెంటనే విచారించాలి అని జడ్జి పోలీసులకు ఆదేశించాడు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసు పట్ల దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.