Kanpur: ఈ భార్య ఆడవాళ్ల పరువు తీసిందిగా.. చదివించిన భర్తతో అలా చేస్తూ?

Kanpur: పెళ్లి జరిగి భార్యను కేవలం ఇంటి పనులకు మాత్రమే పరిమితం చేయకుండా తను ఉన్నత చదువులు చదవాలని మంచి ఉద్యోగం చేయాలన్న ఆశతో భర్త ఎంతో కష్టపడి తన భార్యను నర్సింగ్ చదివించారు.ఆ భార్య కూడా అంతే కష్టపడి చదువుతూ మంచి ఉద్యోగం సంపాదించింది ఇక జీవితం అంతా సంతోషంగా సాగిపోతుంది అనుకున్న క్రమంలో ఆ భార్య తన భర్తను వదిలేసిన ఘటన కాన్పూర్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాలలోకి వెళితే…

కాన్పూర్ దేహత్ లోని మైతాపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రవీంద్రపురం గ్రామానికి చెందిన అర్జున్ కు బస్తీ జిల్లాకు చెందిన సవిత మౌర్యతో 2017 వ సంవత్సరంలో వివాహం జరిగింది. మొదటినుంచి చాలా ప్రిస్టేసియస్ గా ఫీల్ అయ్యే సవిత తన భర్త ముందు మంచి ఉద్యోగం చేస్తూ గొప్పగా ఉండాలని భావించింది. అయితే తన భార్య కోరిక మేరకే ఆయన కష్టపడుతూ ఆమెను కాన్పూర్ లోని మందానలో రామా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ పారా మెడికల్ సైన్స్ ఇన్స్టిట్యూట్లో ఆమెను చేర్పించారు.

 

ఇలా నర్సింగ్ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించిన సవిత ఎందరికో ఆదర్శంగా నిలిచింది. ఇలా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించినటువంటి ఈమె తనకు ఉద్యోగం వచ్చి మంచి జీతం రావడం మొదలైంది. ఇలా తనకు మంచి శాలరీ రావడమే కాకుండా తన ప్రవర్తనలో కూడా మార్పులు వచ్చాయి. దీంతో తన భర్తను నల్ల కుబేరుడు అంటూ ఆట పట్టించడం మొదలైంది.

 

ఇలా ఎప్పటికప్పుడు అందరి ముందు తన భర్త నల్లగా ఉన్నాడంటూ ఆమె తన భర్తను అవమానించడమే కాకుండా చివరికి నువ్వు మా స్టేటస్ కి సరిపడవు అందుకే నీకు దూరంగా ఉంటాను అంటూ ఈమె తన భర్త నుంచి విడిపోయారు.ఇలా తన అవసరం కోసం భర్తను వాడుకొని తాను జీవితంలో స్థిరపడిన తర్వాత భర్తను వదిలేయడంతో ఈ బాధనంతటిని అర్జున్ మీడియా ముందు చెప్పుకున్నారు. ఇక ఈ విషయం వైరల్ గా మారడంతో ఎంతోమంది సవిత వ్యవహారంపై మండిపడుతూ కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి ఒకరి వల్ల స్త్రీ జాతికే చెడ్డపేరు వస్తుందంటూ కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -