Balakrishna: మీనాతో బాలయ్య రియల్ లిప్ లాక్.. బాలయ్య కృష్ణుడే అంటూ?

Balakrishna: ప్రతివారం ‘అన్‌స్టాపబుల్-2’ టాక్ షో ఓటీటీ ప్రేక్షకులను భారీగా అలరిస్తోంది. ఇప్పటికే సీజన్-1 కంప్లీట్ చేసుకున్న ఈ టాక్ షో.. సీజన్-2 రెండు ఎపిసోడ్లు కంప్లీట్ చేసుకుంది. నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న ఈ షో తాజా ఎపిసోడ్‌కు యువ హీరోలు అడివి శేష్, శర్వానంద్ హాజరయ్యారు. ఈ షోలో ఎన్నో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. సెలబ్రిటీల ముచ్చట్లే కాదు.. మధ్య మధ్యలో బాలకృష్ణ వ్యక్తిగత విషయాలు కూడా బయట పడ్డాయి. ఈ షోలో బాలయ్య.. అడివి శేష్‌ని నువ్వు నీ సినిమాల్లో ఫస్ట్ కిస్ ఎవరికి పెట్టావని అనగానే ఆదా శర్మ అని అన్నాడు. అలాగే లాస్ట్ కిస్ ఎప్పుడు పెట్టావని అనగానే.. హిట్-2 సినిమాలో మీనాక్షి చౌదరికి అంటూ శేష్ టక్కున సమాధానం చెప్పాడు. ఆ తర్వాత బాలయ్య.. ఫ్యూచర్‌లో ఎవరికి కిస్ చేయాలనుకుంటున్నావని అడిగినప్పుడు.. అడివి శేష్ కొంచెం ఆలోచించి కత్రినా కైఫ్ అన్నాడు. అస్సలు కిస్ చేయొద్దనుకుంటున్న హీరోయిన్ ఎవరని బాలయ్య అడిగినప్పుడు.. అలియా భట్ అని జవాబిచ్చాడు. దీనికి శర్వానంద్ అమాయకంగా రియాక్షన్ ఇవ్వగానే.. శేష్ అతని వైపు చూసి మొన్నే పెళ్లైంది కదా.. అని చెప్పాడు. దానికి శర్వానంద్.. కత్రినా కైఫ్‌కి పెళ్లవలేదా? అని ఆటపట్టించాడు.

 

అయితే బాలయ్యను.. మీరు సినిమాలో ఎవరికైనా లిప్ కిస్ ఇచ్చారా? అని ఈ యువ హీరోలు అడిగారు. దానికి బాలయ్య తన ‘బొబ్బిలి సింహం’ సినిమా షూటింగ్‌లో జరిగిన ఓ సన్నివేశాన్ని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘బొబ్బిలి సింహం సినిమా ఓపెనింగ్ షూట్ వేమూరు గుట్టపై జరుగుతుంది. షూటింగ్‌లో రజనీకాంత్-మీనా పాల్గొన్నారు. సినిమా ఓపెనింగ్ షూట్‌కు చాలా మంది ప్రముఖులు వచ్చారు. రజనీకాంత్ క్లాప్ కొట్టి షూటింగ్ స్టార్ట్ చేశారు. అప్పుడు ఓ షూటింగ్ కూడా ప్లాన్ చేశారు డైరెక్టర్. నేను సీరియస్‌గా డైలాగ్ చెబుతున్న తర్వాత ఔట్ ఫీల్డ్ నుంచి మీనా నా దగ్గరికి వచ్చి.. నా బుగ్గపై ముద్దు పెట్టాలి. నా డైలాగ్ పూర్తయింది. కానీ మీనా రావడానికి కాస్త లేట్ అయింది. దీంతో ఇంకా ఎందుకు రావట్లేదని అటుగా తిరిగాను. దాంతో లిప్ లిప్ దగ్గరికొచ్చారు. అనుకోకుండా లిప్ కిస్ అవ్వడంతో మీనా కెవ్వుమని అరిచింది.’ అని తనకు జరిగిన ఓ ఫన్నీ ఇన్సిడెంట్‌ను చెప్పుకొచ్చారు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -