Tollywood: సీనియర్ నటి ఝాన్సీ ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో ఓ వెలుగు వెలిగింది. ఈమె ఇప్పుడు అద్దె ఇంట్లో ఉంటూ ఒంటరి జీవితాన్ని గడుపుతుంది. ఒకప్పుడు చెన్నైలో లగ్జరీ ఇంట్లో ఉన్న ఆమె ఇప్పుడు ఆస్తులన్నీ అమ్మేసి హైదరాబాద్ లోని ఓ అద్దె ఇంట్లో ఉంటోంది. 78 ఏళ్ల వయసులో కష్టాలు పడుతూ ప్రతినెలా గడవడం కూడా ఇబ్బందిగా మారిందని చెబుతోంది. అయితే తన వద్ద ఉన్న ఆస్తులు ఎవరెవరు లాగేసుకున్నారన్న దానిపై క్లారిటీ ఇచ్చింది.
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఝాన్సీ ఇలా అన్నారు… ఇంతకు ముందు చెన్నైలో ఉం డేవాళ్లం . కానీ ఇండస్ట్రీ హైదరాబాదుకు రావడంతో మేం కూడా వచ్చే శాం . అయితే ఇక్కడికి వచ్చాక నాకు అంతగా అవకాశాలు రాలేదు. అప్పుడే సొంత బ్యానర్ను ఏర్పాటు చేసి సినిమాలు నిర్మించాం . సుమన్తో ‘ఖైదీ ఇన్ స్పెక్టర్’ అనే సినిమాను తీశాం. ఆమూవీ బాగానే ఆడినా డబ్బులు మా వరకు రాలేదని చెప్పారు.
ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు నిర్మించి బాగా నష్టపోయాం . దీంతో చెన్నై, హైదరాబాద్లోని ఇళ్లన్నీ అమ్మేసి అప్పులన్నీ తీర్చేశాం . ఇక నా ఇద్దరు కొడుకులకు పెళ్లిళ్లు చేశాను. అయితే పెళ్లి అయ్యాక వాళ్ల భార్యలతో కలిసి నన్ను వదిలేసి వెళ్లిపోయారు. తన వద్ద ఉన్న డబ్బు అంతా లాగేసుకున్నారు. ఇప్పుడు ఈ పరిస్థితలో ఉండటానికి వారు కారణం అని విలపించారు ఝాన్సీ.