Live In Relationship: సహజీవనం చేస్తున్న మహిళ అనుభవాలు తెలిస్తే షాకవ్వాల్సిందే!

Live In Relationship: ఒకప్పటి రోజుల్లో సహజీవనం అంటే దానిని వింతగా చూడడంతో పాటు అదొక బూతు పదం, బూతు పనిలా భావించేవారు. కానీ రాను రాను టెక్నాలజీ బాగా డెవలప్ అవడంతో సహజీవనం అన్నది సర్వసాధారణమైపోయింది. ఇక పెద్దపెద్ద సిటీలలో అయితే ఇదొక కల్చర్ అని చెప్పవచ్చు. సామాన్య వ్యక్తులే కాకుండా సెలబ్రిటీలు కూడా ఈ సహజీవనం చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఒక మహిళ తన సహజీవనం అనుభవాలను తెలిపింది. ఆ వివరాల్లోకి వెళితే..

త‌మిళ‌నాడుకు చెందిన క‌వితా గ‌జేంద్ర‌న్ మొద‌ట ఒక వ్య‌క్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తరువాత ఇద్ద‌రి మ‌ధ్య విభేదాలు రావ‌డంతో విడాకులు తీసుకున్నారు. ఆ త‌ర‌వాత క‌వితా గజేంద్ర‌న్ పెళ్లి చేసుకోకూడ‌ద‌ని నిర్న‌యం తీసుకుంది. అయితే జీవితంలో ఒక తోడు కావాలి కాబ‌ట్టి రాజ సంగీత‌న్ అనే వ్య‌క్తితో స‌హ‌జీవ‌నం చేస్తోంది. క‌వితా వామ‌ప‌క్ష రాజ‌కీయాల‌లో చురుకుగా వ్య‌వ‌హ‌రిస్తోంది. రాజ సంగీత‌న్ కూడా వామ‌ ప‌క్ష‌రాజకీయాల్లో ప‌నిచేయ‌డంతో పాటు ఆయ‌న మంచి ర‌చ‌యిత‌ కూడా.

 

స్వేచ్చ స్వ‌తంత్య్రాలు క‌ట్ట‌డి చేయ‌లేని బంధం కోస‌మే స‌హ‌జీవ‌నం నిర్న‌యం తీసుకున్నట్లు తెలిపింది. తాను మ‌ధ్య‌త‌ర‌గతి కుటుంబం నుండి వ‌చ్చాన‌ని, ఇంట్లో ఒత్తిడి వ‌ల్ల 25 ఏళ్ల వ‌య‌సులో తాను ప్రేమించిన వ్య‌క్తినే పెళ్లి చేసుకున్నాన‌ని చెప్పింది. త‌ను చెడ్డ‌వాడు కాద‌ని కానీ కుటుంబం స‌మాజం వ‌ల్ల త‌న‌పై ఆంక్ష‌లు విధించాడ‌ని తెలిపింది. ఇద్ద‌రి మ‌ధ్య విభేదాలు రావ‌డంతో మూడేళ్ల‌కే విడాకులు తీసుకున్నట్లు తెలిపింది.

ఆ తర్వాత సోష‌ల్ మీడియాలో రాజ సంగీత‌న్ అనే వ్య‌క్తి ప‌రిచ‌యం అయ్యాడ‌ని అత‌ని బావాలు తన భావాలు ఒకేలా ఉండ‌టం వ‌ల్ల ఇద్ద‌రం క‌లిసి ఉండాల‌ని నిర్న‌యం తీసుకున్నట్లు ఆమె తెలిపింది. కాగా తనకి వివాహం అందించ‌లేని అవ‌గాహ‌న స‌హ‌జీవ‌నం అందించింద‌ని చెప్పుకొచ్చింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -