Tattoo: టాలీవుడ్ హీరో శర్వానంద్ సమంత నటించిన చిత్రం జాను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ సినిమాని తమిళ్ 96 మూవీకి రీమేక్ గా వచ్చింది. తమిళ్, తెలుగు రెండు భాషలలోను ఈ సినిమా ఎమోషనల్ మూవీగా నిలిచింది. తమిళంలో ఈ సినిమాలో విజయ్ సేతుపతి త్రిష హీరో హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ సినిమాలో త్రిష చిన్నప్పటి పాత్రలో నటించారు చైల్డ్ ఆర్టిస్ట్ గౌరీ కిషన్.
ఇలా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈమె ఇప్పుడు హీరోయిన్ గా మారిపోయి తెలుగు తమిళ భాషలలో సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈమె తెలుగులో శ్రీదేవి శోభన్ బాబు అనే సినిమాలో హీరోయిన్ గా నటించారు. ఇక హీరోయిన్గా ప్రస్తుతం తెలుగు తమిళ భాషలలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.
ఇలా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉన్నటువంటి ఈమె తాజాగా అభిమానులతో కలిసి చిట్ చాట్ చేశారు. ఈ క్రమంలోనే తన బాడీలో టాటూ ఉందని అది ఎక్కడుందో చెప్పాలి అంటూ పజిల్ చేశారు. దీంతో నేటిజన్స్ వారికి తోచిన విధంగా సమాధానాలు చెప్పారు అయితే ఈమె మాత్రం ఏకంగా తాను టాటూ ఎక్కడ వేయించుకున్నారు అనే విషయాన్ని ఫోటోతో సహా పోస్ట్ చేశారు.
ఇలా ఈమె తన ప్రైవేట్ పార్టీపై టాటూ వేయించుకున్నాను అంటూ అందుకు సంబంధించిన ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటో వైరల్ గా మారింది. దీంతో పలువురు ఈ ఫోటో పై స్పందిస్తూ తీవ్రస్థాయిలో నటి గౌరీ కిషన్ పై మండిపడుతున్నారు.మీరు ఎక్కడ టాటూ వేయించుకోవాలి అన్నది మీ ఇష్టం కానీ ఇలా మీ ప్రైవేట్ పాటకు వేయించుకున్న టాటూని కూడా ఫోటో తీసి పెట్టడానికి సిగ్గు లేదా అంటూ దారుణంగా ఈమెపై కామెంట్స్ చేస్తున్నారు.