వారాహి వాహనంపై పవన్ మంగళగిరి నుంచి మచిలీపట్నం సభా వేదిక వద్దకు బయల్దేరారు. అక్కడికి రావడానికి ఐదు గంటల సమయం పట్టింది. అంత వరకూ సభా వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు, నాయకుల ప్రసంగాలు కొనసాగాయి. అన్నీ పూర్తయి పవన్ ప్రసంగం సరిగ్గా రాత్రి పది గంటలకు ప్రారంభమైంది. గంటన్నర పాటు ఆయన ప్రసంగం కొనసాగింది. అంటే రాత్రి 11.30 గంటలకు పవన్ ప్రసంగం పూర్తయింది. పవన్ ప్రసంగం పూర్తయ్యే వరకూ అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు సభా ప్రాంగణంలోనే ఉండడం గొప్ప సంగతి అని చెప్పవచ్చు. కానీ ఇతర సభల్లో అయితే కాస్త చీకటి అయింది కాస్త లేట్ అయింది అంటే చాలు పార్టీ సభలో ఉండే వారి కంటే వెళ్ళిపోయే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది.
కానీ అర్ధరాత్రి అవుతున్నా జనసభ ఆవిర్భావ సభలో అలాంటి సీన్ కనిపించలేదు. ఇలాంటి ప్రాణం ఇచ్చే అభిమానుల్ని పెట్టుకుని, పవన్ టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం పని చేయడమే విచారకరం. జనసేన ఎదగకపోవడానికి పవన్ స్వీయ తప్పిదాలే కారణం. అంతే తప్ప, జన సైనికులు, అభిమానులది ఎంత మాత్రం కాదు. అయితే ఈ విషయంలో జగన్ తో పోల్చుకుంటే పవన్ కళ్యాణ్ గ్రేట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే చాలా సందర్భాలలో జగన్ ఏర్పాటు చేసిన సభలలో చాలావరకు ప్రసంగాన్ని వినకుండా మధ్యలో నుంచి వెళ్లిపోయిన వారే ఎంతో మంది ఉన్నారు.