Samantha: శాకుంతలం దెబ్బకు సమంత కెరీర్ ముగిసినట్లేనా?

Samantha: సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం శాకుంతలం. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా విడుదలకు ముందు సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే విడుదల తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఏమాత్రం చేరుకోలేకపోయింది. ఇలా ఈ సినిమా మొదటి షో తోనే నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

సాధారణంగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు అంటే నిర్మాతలు ధైర్యం చేసి ఖర్చులు చేయరు. కానీ శాకుంతలం సినిమా కథపై నమ్మకంతోను అలాగే సమంత హీరోయిన్గా నటించిన ఈ సినిమా కోసం దాదాపు 60 కోట్ల వరకు పెట్టుబడి పెట్టినట్టు తెలుస్తుంది.ఇక ఈ సినిమా మూడు రోజులు కలెక్షన్లు రాబట్టిన మూడు కోట్లు కూడా వసూళ్లు రాబట్టకపోవడం గమనార్హం.

ఇలా ఈ సినిమా డిజాస్టర్ కావడంతో ఎంతోమంది ఈ సినిమాపై సమంత నటనపై కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమా చూసిన కొందరు ఇకపై సమంత సినిమాలు చేయకపోవడమే మంచిది అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇక మరికొందరు ఈ సినిమాతో సమంత కెరియర్ ముగిసిపోయిందని ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగడం కష్టం అంటూ భావిస్తున్నారు. ఇలా 60 కోట్లు పెట్టుబడిగా పెట్టిన ఈ సినిమా అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచిందని డిజాస్టర్ లో కూడా సరికొత్త రికార్డును సృష్టించినదని చెప్పాలి.

 

ఇక ఈ సినిమా గుణశేఖర్ దర్శకత్వంలో రావడమే కాకుండా గుణ టీమ్స్ బ్యానర్ పై నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మించగా దిల్ రాజు ఈ చిత్రాన్ని పంపిణీ చేశారు. ఇలా ఈ సినిమా కోసం అగ్ర దర్శకులు నిర్మాతలు అగ్రతార సమంత నటించినప్పటికీ ఈ సినిమా ఏ మాత్రం ఆదరణ నోచుకోలేక పోయింది. కంటెంట్ బలంగా ఉన్నప్పుడే చిన్న సినిమా అయినా పెద్దగా హిట్ అవుతుందని కంటెంట్ లేకపోతే కోట్లు పెట్టిన సినిమాని కూడా ప్రేక్షకులు ఆదరించరని మరోసారి సమంత నటించిన శాకుంతల సినిమా నిరూపించింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -