Suma-Rajiv: రాజీవ్ కనకాల విషయంలో సుమ కఠినంగా ఉండటానికి అసలు కారణమిదా?

Suma-Rajiv: తెలుగు సినీ ప్రేక్షకులకు యాంకర్ సుమ కనకాల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో నెంబర్ వన్ యాంకర్ ఎవరు అనగానే సుమ పేరే వినిపిస్తుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికి సుమా సుపరిచితమే. ఈ వయసులో కూడా గలగలా మాట్లాడడంతో పాటు అంతే ఎనర్జీతో డాన్సులు వేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటుంది. ఏ ఈవెంట్ లో చూసినా, ఏ షోలో చూసినా, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చూసినా ఇలా ఎక్కడ చూసినా కూడా ఆమె పేరే వినిపిస్తూ ఉంటుంది.

సుమ యాంకర్ గా వ్యవహరిస్తుంది అంటే ఎంటర్టైన్మెంట్ కూడా కావాల్సినంత ఉంటుంది అని చెప్పవచ్చు. తన మాటలతో చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరినీ అలరిస్తూ బోరింగ్ అన్న ఫీలింగ్ కలిగించకుండా వినోదాన్ని పంచగలదు. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే సుమ లేకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా ప్రమోషన్స్ లేనట్టే అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఎంతోమంది డైరెక్టర్లు సినిమా ప్రమోషన్స్ చేయాలి అనుకున్నప్పుడు సుమ డేట్స్ కోసం కూడా అడ్జస్ట్ ఉంటారు అంటే ఆమె క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇండస్ట్రీలోకి వచ్చిన దగ్గర నుంచి కొన్ని వేల కోట్లు కూడ‌బెట్టింది. అలా సుమ సంపాదించిన ఆస్తిలో ఒక్క రూపాయి కూడా తన భర్తకు చెందకుండా వీలునామా రాసిందంటూ వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

సుమ కనకాల గతంలో ఒక ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాము. కానీ మేము కూడా ఒక సందర్భంలో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నాము. కానీ పిల్లలు గుర్తుకు వచ్చి ఆగిపోయామని చెప్పుకొచ్చింది. ఇక సుమ తను రాసిన వీలు నామాలో ఆస్తి కొడుకు రోషన్ కి సగం కూతురు మనస్వినికి సగం వచ్చేటట్లు రాసిందట.
ప్రస్తుతం ఈ వార్త హాట్ టాపిక్ మారడంతో చాలామంది గతంలో సుమ రాజీవ్ క‌నకల విడాకుల గురించి జరిగిన ఇంటర్వ్యూని వైరల్ చేస్తూ వారి ఇద్ద‌రిమ‌ద్య ఏదో పెద్ద గొడవే జరిగి ఉంటుందని అందుకే సుమ ఇలా రాజీవ్ కనకాలకు ఒక్క రూపాయి కూడా ఆస్తి రాకుండా వీలునామా రాసి ఉంటుందని వార్తలు కోడై కూస్తున్నాయి.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -