Adivi Sesh: టాలీవుడ్ లో తక్కువ సినిమాలు చేసినా మంచి గుర్తింపు సాధించిన హీరోల జాబితాలో అడివి శేష్ ఒకడు. సినిమా కథల విషయంలో ఎంతో వైవిధ్యాన్ని పాటించే అడివి శేష్.. ప్రేక్షకులకు ఎలాంటి కథలు నచ్చుతాయనే విషయాన్ని కనిపెట్టి.. అలాంటి సినిమాలే చేస్తున్నాడు. ‘గూఢచారి’తో భారీ హిట్ కొట్టిన అడివి శేష్.. ‘మేజర్’, ‘హిట్ 2’లాంటి సినిమాలతో ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు.
తెలుగులో మంచి సబ్జెక్ట్ ఉన్న కథలతో సినిమాలు చేస్తూ.. మెల్లిగా రికార్డులు క్రియేట్ చేస్తున్న అడివి శేష్ ఎంతో సక్సెస్ ఫుల్ గా దూసుకెళుతున్నాడు. అయితే తాజాగా అడివి శేష్ కు సంబంధించిన ఓ వ్యక్తిగత విషయం సినీ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. బ్యాచిలర్ గా ఉన్న అడివి శేష్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే అక్కినేని కుటుంబానికి చెందిన ఆమెను అతడు పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
‘గూఢచారి’ సినిమాతో అడివి శేష్ తో కలిసి నటించిన సుప్రియని అతడు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అక్కినేని కుటుంబానికి చెందిన సుప్రియ.. అక్కినేని నాగార్జునకు మేనకోడలు అవుతుంది. మొన్నీమధ్యన క్రిస్మస్ సందర్భంగా అక్కినేని ఫ్యామిలీతో కనిపించిన అడివి శేష్.. సుప్రియ పక్కనే కూర్చొని ఫోటోకు పోజిచ్చాడు.
ఈ క్రమంలోనే త్వరలోనే అడివి శేష్ మరియు సుప్రియలు పెళ్లి చేసుకోబోతున్నారని ఇండస్ట్రీలో చర్చ సాగుతోంది. అయితే ఈ పెళ్లికిగాను అడివి శేష్ భారీగా కట్నం తీసుకుంటున్నట్లు కూడా టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అడివి శేష్ రూ.20కోట్ల వరకు కట్నంగా తీసుకుంటున్నాడని తెలుస్తుండగా.. వీరి పెళ్లికి అక్కినేని నాగార్జున కూడా ఓకే చెప్పేశాడట. త్వరలోనే అధికారికంగా వీరి పెళ్లి వార్త చెబుతారని అందరూ చర్చించుకుంటున్నారు.