PawanKalyan: పవర్స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతోపాటు సినిమాల్లోనూ ఫుల్ బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అందుకే సినిమాల కంటే పొలిటికల్ కెరీర్పైనే ఫోకస్ పెట్టారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా వైసీపీ పార్టీని ఓడించాలని జనసేన తీవ్రం శ్రమిస్తోంది. అయితే ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై ప్రతిపక్షాలు తీవ్రంగానే విమర్శిస్తున్నాయి. రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని ఆరోపిస్తూ ఉన్నారు.
అయితే పవన్ కళ్యాణ్ పొలిటకల్ ఎంట్రీ ఇవ్వకన్న ముందే మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాక కొన్నాళ్లకే మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడు. స్టార్ హీరోగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న పవన్.. కెరీర్ పరంగా దూసుకెళ్లాడు. కానీ, వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. దాంతో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలపై రాజకీయ నాయకుల్లో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్పై కామెంట్లు కూడా చేశారు.
అయితే వైవాహిక జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందుల వల్లే తాను మూడు పెళ్లిళ్లు చేసుకున్నట్లు పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ప్రతిపక్ష నాయకులు పదే పదే విమర్శలు చేయడంతో.. ఇటీవల పవన్ కళ్యాణ్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. తన మొదటి భార్యకు ఎందుకు విడాకులు ఇచ్చారో జనసేన పార్టీ కీలక నేత అద్దేపల్లి శ్రీధర్ తెలిపారు. తాజాగా ఓ మీడియా ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ సందర్భంగా అద్దేపల్లి శ్రీధర్ మాట్లాడుతూ..‘పవన్ కళ్యాణ్ మొదటగా వైజాగ్కు చెందిన నందిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. వీరి వైవాహిక జీవితం కొన్ని నెలలపాటు బాగానే సాగింది. కానీ నందిని పవన్ కళ్యాణ్ను ఇల్లరికం రమ్మని ఒత్తిడి చేసేది. అది పవన్ కళ్యాణ్కు ఇష్టం లేదు. దాంతో వీరిద్దరి మధ్య గొడవలు పెరిగాయి. చివరికి విడాకులకు దారితీసింది. విడాకులు తీసుకుని పదేళ్లయినా.. ఇప్పటికీ ఏ రోజూ పవన్ కళ్యాణ్ ఆమెను ఇబ్బంది పెట్టలేదు.’ అని ఆయన చెప్పుకొచ్చారు.