Sajjala Ramakrishna: సజ్జలను బలివ్వడానికి రంగం సిద్ధమైందా.. ఏమైందంటే?

Sajjala Ramakrishna: ఆంధ్రప్రదేశ్ లో మరొక సంవత్సరంలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు చాలా తారు మారవుతున్నాయి. ప్రజలకు ఎన్నో సంక్షేమ ఫలాలను అందిస్తూ ప్రజల క్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి వైఎస్ఆర్సిపి పార్టీలో రాజకీయాలు మొదలయ్యాయని ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలు ఒకరిపై మరొకరు దూషణలు చేసుకోవడమే కాకుండా జగన్ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తూ వస్తున్నారు.

వైఎస్ఆర్సిపి ప్రధాన సలహాదారుడిగా కొనసాగుతున్నటువంటి సజ్జల జగన్ కి ఏమీ తెలియకుండా మొత్తం రాజకీయాలు చేస్తున్నారంటూ పలువురు ఎమ్మెల్యేలు ఈయన ధోరణి పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.జగన్ గారిని కలిసి తమ గోడు వినిపించుకోవాలన్నా సజ్జల కలవనివ్వరని ఏ విషయం ఉన్న తనకే చెప్పాలి అంటూ ఆపేస్తున్నారని పలువురు తెలుపుతున్నారు.చివరికి ఈయన సోషల్ మీడియాని కూడా తన గుప్పిట్లో పెట్టుకున్నారని ఈ విషయాలన్నీ జగన్ గారికి అసలు తెలియవు అంటూ విమర్శలు చేస్తున్నారు.

 

ఇలా సజ్జల రామకృష్ణారెడ్డి గురించి వస్తున్నటువంటి ఈ వార్తలపై సీఎం జగన్ ఆలోచనలో పడ్డారని త్వరలోనే ఇందుకు సరైన పరిష్కారాన్ని కూడా ఈయన తీసుకోబోతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజా పరిణామాలతో వైసీపీలోనే ఓ ప్రచారం జరుగుతుంది.. మరో రెండు నెలల్లో సజ్జల ఎక్కడ ఉంటారో చెప్పడం కష్టమని.. ఈ లోపు ఆయన తీవ్రమైన దుర్భర పరస్థితులు ఎదుర్కొంటారని అంటున్నారు.

 

జగన్ కి నెంబర్ టు పొజిషన్లో ఎవరిని ఎక్కువకాలం ఉంచడం ఇష్టం ఉండదు ఇప్పటికే ఎంతో మందిని మార్చిన జగన్ త్వరలోనే సజ్జలపై కూడా చర్యలు తీసుకోబోతున్నారని ఆయనని త్వరలోనే జగన్ బదిలీ చేయబోతున్నారని, ఆయనను బలి చేయటానికి రంగం సిద్ధమైంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా ఏపీలోని రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం చాలా హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -