Chaitanya Niharika: మెగా డాటర్ నిహారిక,జొన్నలగడ్డ చైతన్య ఎట్టకేలకు సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలను నిజం చేస్తూ తాజాగా వారి వివాహ బంధానికి స్వస్తి పలుకుతూ విడాకులు తీసుకొని విడిపోయారు. పెళ్లి జరిగి కనీసం మూడు సంవత్సరాలు కూడా కాకముందే అప్పుడే వారి వైవాహిక బంధానికి స్వస్తి పలకడంతో మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ జంట డిసెంబర్ 9, 2020లో ఉదయపూర్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న విషయం తెలిసిందే. వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.
అయితే పెళ్లయిన తర్వాత దాదాపు ఏడాది పాటు కలిసి బాగానే ఉన్న ఈ జంట ఏడాది తర్వాత నుంచి దూరంగా ఉంటున్నారట. అయితే పెళ్లయిన మొదట్లో వెకేషన్ లు తిరుగుతూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేస్తూ వచ్చారు. కానీ ఒక్కసారిగా ఉన్నఫలంగా ఇద్దరి ఫోటోలు ఒకరి తర్వాత మరొకరు సోషల్ మీడియా ఖాతాల నుంచి డిలీట్ చేయడంతో ఈ జంట విడిపోబోతున్నారు మనస్పర్ధలు తలెత్తాయి అన్న వార్తలు పొందుతున్నాయి. దానికి తోడు మెగా ఫ్యామిలీ లో ఎటువంటి శుభకార్యం జరిగిన అందుకు చైతన్య రాకపోవడంతో ఆ వార్తలకు మరింత ఆజ్యం పోసినట్టు అయ్యింది.
అలా ఎట్టకేలకు సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలను నిజం చేస్తూ ఈ జంట విడాకులు తీసుకొని విడిపోయారు. కలిసి ఉండలేమంటూ కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. ఇందులో పిటిషనర్ నెంబర్ 1 గా చైతన్య పేరు ఉండగా పిటిషనర్ నెంబర్ 2 గా నిహారిక పేరు కనిపిస్తోంది. అయితే వీరిద్దరూ విడాకుల కోసం చేసుకున్న దరఖాస్తులో పర్సనల్ అడ్రస్ తో సహా అన్ని వివరాలు ఉన్నాయి. 1955 హిందూ వివాహ చట్టం 13, 8ప్రకారం వీరిద్దరు పిటిషన్ ఫైల్ చేశారు. ఇక వీరిద్దరు పరస్పర అంగీకారంతోనే తాము విడిపోతున్నట్టు కూడా ప్రకటించేశారు. ఏదేమైనా ఏడాది కాలంగా వీరిద్దరు విడిపోతున్నారంటూ వస్తున్న వార్తలకు ఎట్టకేలకు చెక్ పడింది. వీరు త్వరలోనే వేర్వేరు దారుల్లో ప్రయాణించనున్నారు.