Joginaidu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో దివంగత నటి సౌందర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ అచ్చ తెలుగు అమ్మాయిగా తెలుగులో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా తెలుగు తమిళ కన్నడ భాషలలో నటిగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి నటిగా ఓ వెలుగు వెలిగారు.
ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఉన్నటువంటి ఈమె హెలికాప్టర్ ప్రమాదంలో అకాల మరణం పొందారు. అయితే ఈమె మరణించే సమయానికి కేవలం 31 సంవత్సరాలు వయసు మాత్రమే అని చెప్పాలి. ఇలా ఈ ప్రమాదంలో మరణించి 20 సంవత్సరాలు అవుతున్న ఇప్పటికీ సౌందర్య ప్రేక్షకుల మధ్యలో పదిలంగా ఉన్నారని చెప్పాలి. ఇక ఈమె తెలుగులో అమ్మోరు సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత అంతపురం సినిమాలో నటించారు.
కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్లో భాగంగా ఒకరోజు సౌందర్య రాలేకపోయారట. అయితే కృష్ణవంశీ దగ్గర యాంకర్ ఝాన్సీ మాజీ భర్త జోగి నాయుడు అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేసే వారని తెలుస్తుంది. అయితే సౌందర్య రాకపోవడంతో సౌందర్య కు డూప్ గా జోగి నాయుడు అంతపురం సినిమాలో నటించారని తెలుస్తుంది. ఇలా ఈ సినిమాలో జోగి నాయుడు సౌందర్యకు డూప్ గా నటించడమే కాకుండా సౌందర్యకు డూప్ గా నటించిన ఏకైక వ్యక్తి ఈయనేనని చెప్పాలి.
ఈ విధంగా జోగినాయుడు సౌందర్యకు మధ్య ఈ సినిమా పరంగా రిలేషన్ ఉంది. ఇక సౌందర్య ఎంతోమంది టాలీవుడ్ స్టార్ హీరోలతో కలిసి సినిమాలలో నటించారు ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ సాధించినటువంటి ఈమె రాజకీయాలలోకి అడుగుపెట్టారు. ఎలా రాజకీయాల ప్రచార కార్యక్రమాలలో భాగంగా ఈమె హెలికాప్టర్లో ప్రయాణం చేస్తూ ఉండగా ప్రమాదానికి గురై మరణించారు.