Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మంచి మనస్సుకు నిదర్శనం ఇదేనా?

Pawan Kalyan: టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. పవన్ చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలు ఉన్నాయి. ఇందులో ఇప్పటికే కొన్ని సినిమాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో ఫుల్ యాక్టివ్ గా పాల్గొంటున్నారు పవన్. తనకు సమయం దొరికినప్పుడల్లా రాజకీయాలలో పాల్గొంటూ క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా గడుపుతున్నారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ వచ్చే ఏడాది ఎలా అయినా గెలవాలి అన్న కసితో ప్రచార కార్యక్రమాలలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు.

ఇటీవల వారాహి వాహనంపై తన ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అశేష జనం మధ్య జనాల కష్టాలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు పవన్ కళ్యాణ్. పవన్ వస్తున్నారు అంటే ఏ రేంజ్ లో అభిమానులు జనసేన నాయకులు హాజరవుతారు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే చాలా సందర్భాలలో పవన్ కళ్యాణ్ ప్రచార కార్యక్రమాలలో పాల్గొనగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాములు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. మరి ముఖ్యంగా వారాహి బస్సు యాత్రలో భాగంగా కొన్ని వందల మంది పవన్ కళ్యాణ్ తో పాటు పాల్గొంటున్నారు.

 

అయితే వారాహి బస్సు యాత్రలో పాల్గొనే వారందరికీ కూడా పవన్ కళ్యాణ్ తన సొంత ఖర్చుతో భోజనాలు కూడా ఏర్పాటు చేయించడం విశేషం. ఒక పూట కాదు మూడు పూటలా తనతో పాటు వచ్చిన చాలామందికి ఆకలిని నింపుతున్నారు పవన్ కళ్యాణ్. ఇదే విషయం గురించి పచ్చళ్ల ప్రకాష్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర దాదాపుగా రోజుకు 400 మందికి పైగా భోజనాలు పెడుతున్నాము. ఆ క్యాటరింగ్ ఒప్పుకున్నది కూడా నేనే అని తెలిపారు పచ్చళ్ల ప్రకాష్. 400 మంది అని మాత్రమే కాదు అంతకంటే ఎక్కువ సంఖ్యలో కూడా వస్తారు వారందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు భోజనం ఏర్పాట్లు చేయిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు నిజంగా దేవుడు. ఆయన ఎన్నికలలో తప్పకుండా గెలవాలని పదేపదే కోరుకుంటున్నాను అని తెలిపారు ప్రకాష్. ఉదయం టిఫిన్ అయిపోగానే మధ్యాహ్నం లంచ్ ఆ తర్వాత రాత్రి డిన్నర్ ఇలా 400 మందికి పైగా ప్రతి రోజు మూడు పూటలా చేయిస్తున్న గొప్ప మనసున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటూ ప్రశంసలు కురిపించారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -