Temple Bells: ఆలయంలో గంటలు ఉండడం వెనుక ఉన్న ఆంతర్యం ఇదే?

Temple Bells: భారతదేశంలో ఎన్నో రకాల ఆలయాలు ఉన్నాయి.
అంతేకాకుండా భారతీయ సంస్కృతిలో ఎక్కడ చూసినా దైవారాధనకు ప్రాముఖ్యత ఎక్కువ. అయితే మనకు ఎటువంటి ఆలయానికి,క్షేత్రానికి వెళ్ళినా ఆలయంలో అడుగుపెట్టగానే మొదట కనిపించేది గంట. స్వామి సన్నిధిలో అడుగుపెట్టగానే అప్రయత్నంగా గంట మోగిస్తారు. ఆలయం బయట ఆలయం లోపల గంటలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఆలయంలో స్వామివారికి హారతి ఇస్తున్న సమయంలో కూడా గంటలు ముగిస్తూ ఉంటారు. అయితే ఆలయంలో గంటను ఎందుకు కడతారు? భక్తులు ఎందుకు గంటను కొడతారు? ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఇంట్లో కానీ, గుళ్లొకానీ పూజ మొదలు పెట్టే ముందు గంట కొట్టడం అన్నది తప్పనిసరి. దేవతలను ఆహ్వానిస్తూ రాక్షసగణాలను తరిమికొట్టేందుకు పూజ ప్రారంభం ముందు గంటను కొడతారు. కాగా దేవుని ముందు గంట కొట్టడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్న దుష్ట శక్తులను, వ్యతిరేఖ కిరణాలను దూరం చేస్తుంది. గంట ఒక శబ్ధానికి లేదా సృష్టి శబ్ధానికి చిహ్నంగా పరిగణిస్తారు. అందుకే గంట కొడతారు. అలాగే గంట మోగిస్తే అన్ని రకాల వాస్తు దోషాలు తొలగిపోతాయి. గంట శబ్దం ఎక్కడైతే క్రమం తప్పకుండా వస్తుందో అక్కడి వాతావరణం ఎప్పుడూ స్వచ్ఛంగా, పవిత్రంగా ఉంటుంది.

 

స్కంద పురాణం ప్రకారం గుడిలో గంట మోగించడం వల్ల మనిషికి వంద జన్మల పాపాలు నశిస్తాయని విశ్వసిస్తారు. గంటను కొట్టినప్పుడు ఆ గంట శబ్దం నుంచి వచ్చే కంపనాలు వాతావరణంలో వ్యాపించిన బ్యాక్టీరియా, వైరస్‌లను నాశనం చేస్తాయి. లయబద్ధమైన గంట శబ్దం మనస్సు నుంచి ఉద్విగ్నతను తొలగించి శాంతిని ఇస్తుంది. నిరంతరం గంటను మోగించడం ద్వారా ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. కాలచక్రానికి ప్రతీకగా గంటను పరిగణిస్తారు. ఇళ్ళల్లో కానీ, దేవాలయాల్లో కానీ హారతి సమయంలో గంటను మోగిస్తే మనసుకి ప్రశాంతంగా ఉండి ఆధ్యాత్మికత వైపు మళ్ళిస్తుంది. గంట ఇంకో ప్రత్యేకత ఏమిటంటే గంట సకల దేవతా స్వరూపంగా భావించి ముందుగా గంటను కొడతారు. అలాగే హారతి సమయంలో అందరి దేవుళ్ళను ఆహ్వానిస్తూ గంటను మోగిస్తారు. అందుకే హారతి సమయంలో కళ్ళు మూసుకోవద్దని పురోహితులు చెబుతుంటారు. కంచు గంట మోగించినప్పుడు దానిలో నుంచి ఓం అనే శబ్దం వినిపిస్తుంది. ఓంకార నాదం వినడం వల్ల మనిషిలో ఉన్న చింతలు,సమస్యలు తొలిగిపోయి మనసు ప్రశాంతంగా ఉంటుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -