Niharika: నిహారిక మామిడి పళ్లు తినడం వెనుక అసలు కథ ఇదేనా?

Niharika: సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా వారి వృత్తిపరమైన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకుంటారు.ఈ క్రమంలోనే మెగా డాటర్ నిహారిక సైతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. గత కొద్ది రోజులుగా నిహారిక సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉన్నారు.

సోషల్ మీడియాకు దూరంగా ఉండడంతో తన గురించి ఎన్నో రకాల వార్తలు వినిపించాయి. ముఖ్యంగా ఈమె తన భర్త వెంకట చైతన్యతో విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇలా తన భర్తతో కలిసి ఎక్కాడా కనిపించడం లేదు. అలాగే వీరి పెళ్లి ఫోటోలను కూడా డిలీట్ చేయడంతో ఈ అనుమానాలు మరింత బలం అయ్యాయి. అయితే ఈ విషయం గురించి ఎక్కడ మెగా ఫ్యామిలీ స్పందించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదు.

 

ఇలా విడాకులు వార్తలు వచ్చిన అనంతరం నిహారిక తిరిగి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయ్యారు. ఈ క్రమంలోనే ఈమె తన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు. తాజాగా నిహారిక మామిడి పండ్లు తింటున్నటువంటి ఫోటోలను షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇక ఈ ఫోటోలను షేర్ చేసిన ఈమె మామిడిపండు లేకుండా సమ్మర్ ఏంటి అంటూ వివిధ రకాల ఎక్స్ప్రెషన్స్ ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేశారు.

 

ఈ ఫోటోలు క్షణాల్లో వైరల్ కావడంతో ఎంతో మంది నెటిజన్లు ఈ ఫోటో పై స్పందిస్తూ ఏంటి నిహారిక పుల్లటి మామిడి పండ్లు తింటున్నారు అంటే ఏదైనా విశేషం ఉందా…. త్వరలోనే మాకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నారా అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. మరి నిహారిక ఏదైనా గుడ్ న్యూస్ చెప్పబోతున్నారా లేక మామిడిపండ్ల సీజన్ కావడంతో ఇలా మామిడి పండ్లు తింటూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారో తెలియదు కానీ ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -