Prabhas: ప్రభాస్ బాహుబలి నిర్మాతలను కలవడానికి కారణం ఇదేనా?

Prabhas: ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చినటువంటి మొట్టమొదటి ఆల్ ఇండియా చిత్రం బాహుబలి.ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాన్ ఇండియా స్థాయిలో ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాయి. ఈ సినిమా ద్వారా ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు.ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ చేసిన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

ఇకపోతే తాజాగా ప్రభాస్ బాహుబలి నిర్మాతలను కలవడంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.ప్రభాస్ బాహుబలి నిర్మాతలను కలవడానికి గల కారణం ఏంటి బాహుబలి 3 గురించి చర్చలు జరపడం కోసమే ప్రభాస్ వీరిని కలిసారా అంటూ పెద్ద ఎత్తున సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక బాహుబలి 3 గురించి గతంలో ప్రభాస్ ను ప్రశ్నించగా తనకు బాహుబలి 3 గురించి ఏమాత్రం తెలియదని, ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు అంటూ కామెంట్లు చేశారు.

 

ఇక గతంలో బాహుబలి నిర్మాతలు సైతం బాహుబలి 3గురించి మాట్లాడుతూ ప్రస్తుతం అయితే అలాంటి ఆలోచనలు లేవని ప్రస్తుతం రాజమౌళి తన ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసుకున్న తర్వాతే ఆలోచిస్తామని వెల్లడించారు.అయితే ఉన్నఫలంగా ప్రభాస్ బాహుబలి నిర్మాతలను కలవడంతో తిరిగి మరోసారి ఈ కాంబినేషన్ లో సినిమా రాబోతుందా లేక బాహుబలి 3 గురించి చర్చలు జరపడం కోసమే ప్రభాస్ వీరిని కలిసారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

 

ప్రస్తుతం ప్రభాస్ సైతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇక రాజమౌళి కూడా మహేష్ బాబు సినిమాతో బిజీ కానున్నారు. ఈ క్రమంలోనే బాహుబలి 3 గురించి ఏమాత్రం ఆలోచించే సందర్భాలు లేవని పలువురు భావిస్తున్నారు. అయితే ప్రభాస్ ఇలా బాహుబలి నిర్మాతలను కలవడానికి గల కారణం ఏంటి అనే విషయం తెలియడం లేదు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -