Shaakunthalam: హీరోయిన్ సమంత, దేవ్ మోహన్ హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం శాకుంతలం. ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించిన విధంగా డిజాస్టర్ గా నిలిచింది. అంతేకాకుండా కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా నిర్మాతలకు బోలెడు నష్టాలను మిగిల్చింది. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నెగటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు సినిమా థియేటర్ల వైపు చూడడమే మానేశారు. అయితే ఈతరం ప్రేక్షకులకు నచ్చేలా శాకుంతలం సినిమాను తెరకెక్కించే విషయంలో గుణశేఖర్ తడబడ్డారు.
దిల్ రాజు లాంటి అనుభవం ఉన్న నిర్మాత సైతం ఈ సినిమా రిజల్ట్ ను ముందుగానే అంచనా వేయలేకపోయారు. ఇకపై ఈ సినిమాలో భరతుని రోల్ లో అల్లు అర్హ నటించిన విషయం తెలిసిందే. తన అద్భుతమైన అభినయంతో ప్రేక్షకులను మెప్పించింది. అయితే ఈ సినిమా కోసం మొదట జూనియర్ ఎన్టీఆర్ కొడుకును గుణశేఖర్ భరతుని పాత్ర కోసం తీసుకోవాలని అనుకున్నారట. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తన కొడుకును ఈ సినిమా ద్వారా పరిచయం చేయడానికి అస్సలు ఇష్టపడలేదని సమాచారం. అభయ్ రామ్ ఈ పాత్ర పోషించే అవకాశాన్ని అలా మిస్ చేసుకున్నాడు అని తెలుస్తోంది.
ఒకవేళ అభయ్ రామ్ నటించి ఉంటే ఈ సినిమా రిజల్ట్ మరింత బెటర్ గా ఉండేదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్ తన కొడుకులను సినిమాల్లో ఇప్పుడే పరిచయం చేయాలని అనుకోవడం లేదట. ఇకపోతే ఎన్టీఆర్ విషయానికి వస్తే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేసే పనిలో పడ్డారు చిత్ర బృందం.