Gopichand-Raasi: గోపీచంద్ తో రాశి రొమాన్స్ వెనుక కథ ఇదేనా?

Gopichand-Raasi: రాశి తెలుగు చలనచిత్ర నటి. ఈమె తెలుగు, తమిళ భాషల్లో నటించింది. ఈమె దర్శకుడు శ్రీముని నీ వివాహం చేసుకుంది. 1986లో మమతల కోవెల చిత్రం ద్వారా బాలనటిగా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత బాలనాటిగా కొన్ని చిత్రాల్లో నటించిన తర్వాత హీరోయిన్ గా వరుస అవకాశాలతో సినీ ఇండస్ట్రీలో రాణించింది.

 

కెరీర్ ప్రారంభంలో శుభాకాంక్షలు, గోకులంలో సీత సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకొని తెలుగు ఇండస్ట్రీలోనే అగ్ర హీరోయిన్స్ జాబితాలో చేరిపోయింది. ఇక తనదైన శరీరంలో ముందుకు దూసుకుపోతున్న తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషలలో నటించింది.నిజం సినిమాలో నెగటివ్ రోల్ లో నటించి మంచి గుర్తింపు పొందింది.

 

ఇదిలా ఉండగా.. ఈమె మహేష్ బాబు ‘నిజం’ సినిమాలో చేసిన పాత్రకు ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. ఆ సినిమాలో గోపీచంద్ తో మితి మీరిన రొమాన్స్ కలిగిన సన్నివేశాలే ఆ విమర్శలకు కారణం అని చెప్పొచ్చు. చాలా షోలలో ఈ పాత్ర ఎందుకు చెయ్యాల్సి వచ్చిందో రాశీ క్లారిటీ ఇచ్చింది. అయితే ఇటీవల ఈమె ‘రాశి విజన్స్’ పేరుతో యూట్యూబ్ ఛానల్ ను స్థాపించి అందులో తన సినీ కెరీర్ కు సంబంధించిన కీలక విషయాల గురించి చెప్పుకొస్తున్న సంగతి తెలిసిందే.

 

ఈ క్రమంలో కొందరు నెటిజన్లు ఈమెను ‘నిజం’ సినిమాలో అంత ఘాటు రొమాన్స్ కలిగిన సన్నివేశాల్లో ఎందుకు నటించారని కామెంట్లు పెట్టారు. దానికి ఈమె సమాధానం ఇస్తూ దర్శకుడు తేజ ‘నిజం’ సినిమాలో నా పాత్ర గురించి చెప్పిందొకటి అక్కడ చూపించింది మరొకటి. అందుకే అలాంటి బోల్డ్ పాత్రలో కనిపించాను. మొదటి నుండీ ఇష్టం లేకుండానే ఆ పాత్ర చేశానని చెప్పుకొచ్చింది రాశీ.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: జగన్ అధికారంలోకి వస్తే ఏపీ ప్రజల భూములు పోతాయా.. బాబు చెప్పిన విషయాలివే!

Chandrababu Naidu: జగన్ మరొకసారి అధికారంలోకి వస్తే ప్రజల భూములను అధికారికంగా కబ్జా చేస్తారని భయం ప్రజల్లో పట్టుకుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన భూ యాజమాన్య హక్కు చట్టం కబ్జాదారులకు అక్రమార్కులకు...
- Advertisement -
- Advertisement -