YCP MLA: ఈ వైసీపీ ఎమ్మెల్యే అంటే ఎల్లో మీడియాకు వణుకేనా.. అసలేం జరిగిందంటే?

YCP MLA: ఆ వైసీపీ ఎమ్మెల్యే అంటే టీడీపీకి భయమా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ ఎమ్మెల్యే మరెవరో కాదు తిరుప‌తి జిల్లా చంద్ర‌గిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి. టీడీపీ మీడియా అమ్మ‌కానికి అతీతం కాద‌ని ఆయ‌న నిరూపించారు. ఈనాడు ప‌త్రిక‌ను కాస్త ప‌క్క‌న పెడితే, దాని తోక ప‌త్రిక నిత్యం వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై విషం చిమ్ముతూనే వుంటుంది. అయితే రాష్ట్ర‌మంతా వైసీపీపై దుష్ప్ర‌చారం చేసే ఆ ప‌త్రిక‌ చంద్ర‌గిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి విష‌యంలో మాత్రం ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకుని వార్త‌లు రాస్తూ ఉంటుందని చెప్పవచ్చు.

ఎమ్మెల్యే చెవిరెడ్డి నుంచి వ్యతిరేకంగా ఒక చిన్న వార్త రాయాలి అన్న కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని భయం భయంగా రాస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ ప‌త్రిక ప్ర‌తి అక్ష‌రానికి చెవిరెడ్డి వెల క‌ట్టార‌ని తిరుప‌తి జిల్లాలో విస్తృత‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. దీంతో చెవిరెడ్డి ప‌రువు ప్ర‌తిష్ట‌ల్ని కాపాడే బృహ‌త్త‌ర బాధ్య‌త‌ను ఆ ఎల్లో ప‌త్రిక భుజాన వేసుకుంది. తాజాగా తిరుప‌తి రూర‌ల్ ప‌రిధిలోని పేరూరులో మండ‌ల అధ్య‌క్షుడైన చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డికి సొంత పార్టీ నేత‌ల నుంచి నిర‌స‌న సెగ త‌గిలింది. ఈయ‌న చెవిరెడ్డి పెద్ద‌ కుమారుడు. రానున్న ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌పున ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా బ‌రిలో దిగ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న‌న్న సుర‌క్ష కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు వెళ్లిన మోహిత్‌ రెడ్డిని ఆ గ్రామ వార్డు స‌భ్యుడు గిరిధ‌ర్ గౌడ్ తండ్రి ఈశ్వ‌ర‌య్య‌తో పాటు స్థానికులు స‌మ‌స్య‌ల‌పై నిల‌దీశారు.

 

గ్రామంలో నాలుగేళ్లుగా డ్రైనేజీ స‌మ‌స్య ప‌రిష్క‌రించాల‌ని కోరుతున్నా ప‌ట్టించుకోవడం లేదని, ఇప్ప‌టికైనా ప‌రిష్క‌రించాల‌ని ఆయ‌న్ను చుట్టుముట్టిన‌ట్టు ఈనాడు ప‌త్రిక‌లో వార్త వ‌చ్చింది. సాధార‌ణంగా వైసీపీ ప్ర‌జా ప్ర‌తినిధుల‌ను ఎవ‌రు నిల‌దీసినా ఎల్లో ప‌త్రిక‌ల్లో వార్త‌లు రావ‌డం స‌హ‌జం. కానీ చెవిరెడ్డిని నిల‌దీయ‌డంపై చంద్ర‌బాబు భ‌క్తుడైన ఆర్కే ప‌త్రిక‌లో చిన్న వార్త కూడా లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇదే ప‌త్రిక‌లో ఇవాళ కృష్ణా జిల్లా ఉయ్యూరులో గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో పెన‌మ‌లూరు ఎమ్మెల్యే పార్థ‌సార‌థిని టిడ్కో ఇళ్లు ఎప్పుడిస్తార‌ని లబ్ధిదారులు నిల‌దీస్తున్న‌ట్టు ఫొటోతో కూడిన‌ వార్త‌, అలాగే కాకినాడ జిల్లా కిర్లంపూడి మండ‌లం రామ‌చంద్రాపురంలో జ‌గ‌న‌న్న సుర‌క్ష కార్య‌క్ర‌మంలో జ‌గ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుకు నిర‌స‌న సెగ త‌గిలిన‌ట్టు వార్త‌లొచ్చాయి. రామ‌ చంద్రాపురం గ్రామంలో డ్రైనేజీ వ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్తంగా వుంద‌ని, వ‌ర్షాకాలం మురుగునీరు పోయే మార్గం లేద‌ని ఎమ్మెల్యే చంటిబాబును మ‌హిళ‌లు నిల‌దీశారు. కానీ చంద్ర‌గిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి, ఆయ‌న త‌న‌యుల‌పై ఈగ వాల‌నివ్వ‌కుండా ఆర్కే ప‌త్రిక జాగ్ర‌త్త‌లు తీసుకుంది. చెవిరెడ్డిపై ప్రేమా? లేక ఆయ‌న యాడ్స్ రూపంలో ఇచ్చే డ‌బ్బుపైనా అనేది ఎవ‌రికి వారు నిర్ణ‌యించుకోవాల్సిందే. కానీ ఒక్క‌టి మాత్రం నిజం. ఎల్లో ప‌త్రిక‌కు డ‌బ్బు ఇస్తే నోర్మూసుకుని వారి ప్ర‌యోజ‌నాలు కాపాడతాయ‌ని చెవిరెడ్డి నిరూపించారు. ఈ వాస్త‌వాన్ని చెవిరెడ్డి ప్ర‌తి సంద‌ర్భంలోనూ చాటి చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -