Jabardasth: వామ్మో.. జబర్దస్త్ యాంకర్ రెమ్యునరేషన్ అన్ని వేల రూపాయలా?

Jabardasth: బుల్లితెర కామెడీ షో ‘జబర్దస్త్’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో మంచి పాపులరిటీ సంపాదించుకుంది. గురు, శుక్ర వారాల్లో ప్రసారమయ్యే ఈ షోను చూడటానికి ఎంతో మంది ప్రేక్షకులు ఆతురతగా ఎదురు చూస్తుంటారు. జబర్దస్త్ షోకి యాంకర్స్ అనసూయ, రష్మి ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే అనసూయ, రష్మి షో నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. దీంతో మల్లెమాల కొత్త యాంకర్‌ను తీసుకొచ్చింది. ఆమె కన్నడ బ్యూటీ సౌమ్యరావు. జబర్దస్త్ కొత్త ఎపిసోడ్‌లో సౌమ్యరావును మల్లెమాల ఇంట్రడ్యూస్ చేసింది.

 

 

సౌమ్యరావు.. ఇప్పటికే చాలా సీరియల్స్‌ లో నటించింది. ఇప్పుడు ఈ భామ యాంకర్‌గా దర్శణమిచ్చింది. దీంతో నెట్టింట ఈ భామ ఎవరని తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈటీవీలో ప్రసారమైన ‘శ్రీమంతుడు’ సీరియల్‌లో సౌమ్యరావు మంచి క్రేజ్ సంపాదించుకుంది. అయితే జబర్దస్త్ షోలో ఎంట్రీ ఇచ్చిన ఈ భామకు ఎంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారనే విషయంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే షోలో ఆమె పర్ఫార్మెన్స్, మాట తీరు, ప్రేక్షకులను ఆకట్టుకునే విధానాన్ని బట్టి ఆమెకు రెమ్యూనరేషన్ పెంచుతారని నిర్మాతలు చెప్పారు. అయితే అనసూయ-రష్మి కంటే సౌమ్యరావుకు తక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారని ప్రచారం జరుగుతోంది. రూ.60 వేలకు డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.

 

షో ప్రారంభానికి ముందు అనసూయ, రష్మి అంతే ఎవరికీ తెలియదు. కానీ జబర్దస్త్ షో ద్వారానే తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. సెలబ్రిటీలుగా మారి.. పలు షోలల్లో పాల్గొంటూ.. సినిమాల్లో హీరోయిన్లుగా కూడా రాణిస్తున్నారు. రష్మి.. బుల్లితెరకు గుడ్‌బై చెప్పి.. సినిమాలు, వెబ్‌సిరీస్‌లో నటిస్తోంది. అయితే ఓ వెబ్‌సిరీస్‌లో బోల్డ్ క్యారెక్టర్‌లో కూడా నటించడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అనసూయ కూడా ఓ వెబ్ సిరీస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. గురజాడ అప్పారావు క్లాసిక్ నాటకం ‘కన్యాశుల్కం’ వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -