Janasena Complaint on YS Jagan: ఏపీ ఎన్నికల సంఘం దృష్టికి పవన్ పెళ్లిళ్ల గోల.. జగన్ కు భారీ షాక్ తప్పదా?

Janasena Complaint on YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ కార్యక్రమానికి వెళ్లిన ఏ సభకు వెళ్లిన అక్కడ పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావనకు తీసుకువస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి దత్తపుత్రుడు ప్యాకేజీ స్టార్ మూడు పెళ్లిళ్లు అంటూ ఆయన వ్యక్తిగత విషయాలపై విమర్శలు చేస్తూ ఉంటారు. ఇటీవల మేమంతా సిద్ధం సభలో కూడా పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి జగన్మోహన్ రెడ్డి విమర్శలు ఇచ్చేసిన సంగతి తెలిసిందే.

ఇలా పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి జగన్మోహన్ రెడ్డి తరచూ ప్రస్తావనకు తీసుకు వస్తూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో జగన్మోహన్ రెడ్డి పై ఈసీకి ఫిర్యాదు చేశారు. జనసేన నాయకులు ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ ను కలిసి ఫిర్యాదు చేశారు. పవన్ కళ్యాణ్ పెళ్లిలను ఆయన నియోజకవర్గ మార్పుతో ముడి పెట్టి జగన్మోహన్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు.

ఇక జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ పేరు ప్రత్యక్షంగా ప్రస్తావనకు తీసుకురాకుండా దత్తపుత్రుడు ప్యాకేజి స్టార్ అంటూ విమర్శలు చేశారు. ఇక పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి కూడా మాట్లాడటంతో జనసేన కార్యకర్తలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక సీఎం హోదాలో ఉండే జగన్మోహన్ రెడ్డి ఇలా ఒకటి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటం భావ్యం కాదని తెలుపుతున్నారు.

పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు కాకుంటే 30 పెళ్లిళ్లు చేసుకుంటారు వారికి వచ్చిన నష్టమేంటంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఇలా జగన్మోహన్ రెడ్డి తరచూ పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు గురించి మాట్లాడిన ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల గురించి ప్రస్తావనకు తీసుకురాలేదు. ఇలా తరచూ పెళ్లి గురించి మాట్లాడటంతో ఈ విషయం కాస్త ఎన్నికల అధికారుల వరకు వెళ్లడంతో జగన్మోహన్ రెడ్డికి ఈసీ నుంచి భారీ షాక్ తప్పదనే చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -