Janhvi Kapoor: ఎప్పుడూ సినిమా షూటింగ్లతో బిజిబిజిగా ఉండే జాన్వీ కపూర్ శుక్రవారం తిరుమల తిరుపతి దేవాస్థానంలో ప్రత్యేక్షమైంది. బాలీవుడ్ స్టార్ అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ విఐపీ తన స్నేహితురాలితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంది. అచ్చమైన తెలుగమ్మాయిలా బ్లూ కలర్ లంగాఓణీలో శ్రీవారి దర్శనం చేసుకుంది.
అయితే.. పత్యేకమైన రోజుల్లో జాన్వీ కపూర్ తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకుంటుందనే విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల జాన్వీ నటనించిన ‘గుడ్లఖ్ జెర్రీ’ ఓటీటీలో విడుదలై దూసుకుపోతోంది. ఆమె నటించిన తాజా చిత్రం బవాల్ అనే సినిమా షూటింగ్ పూర్తికాగా విడుదలకు సిద్ధంగా ఉంది. వరుస షూటింగ్లతో బిజిగా ఉండే జాన్వీ కపూర్ వాటికి చిన్న బ్రేక్ ఇచ్చి శుక్రవారం శ్రీవారి సన్నిధిలో పాలు పంచుకుంది.
పస్తుతం జాన్వీ మిస్టర్ ‘అండ్ మిస్ మహి’ సినిమా షూటింగ్తో బిజిబిజిగా ఉంటుంది. శ్రీవారి దర్శనం చేసుకున్న ఆమెకు అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అకస్మాతుగా శ్రీవారి సన్నిధికి వచ్చిన జాన్వీని చూడటానికి జనం ఎగబడ్డారు. ఎంత పెద్ద హీరోయిన్ అయినా తెలుగు సాంప్రదాయ దుస్తులో తిరుపతికి రావడం చాలా బాగుందని అక్కడి ప్రజలు ప్రశంసలు కురిపించారు.