Jayasudha: సహజనటి జయసుధ తన నేచురల్ నటనతో ఎంతమంది అభిమానులను సంపాదించుకుంది. ఆమె నటనకు ఎవరైనా మంత్రముగ్దులు అవ్వాల్సిందే. చాలా సహజంగా ఆమె యాక్టింగ్ ఉంటుంది. సీనియర్ హీరోయిన్ అయిన ఆమె.. టాలీవుడ్ లో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ లాంటి హీరోలందరినీ నటించింది. కుర్ర హీరోల సినిమాల్లో కూడా అమ్మ పాత్రలు, ఇతర పాత్రల్లో జయసుధ నటించింది. ఏ పాత్రలో అయినా ఆమె ఒదిగిపోతుంది.
ఇప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పలు సినిమాల్లో జయసుధ నటిస్తోంది. ఆమెకు అవకాశాలు ఏ మాత్రం తగ్గడం లేదు. అయితే జయసుధ భర్త ఇటీవల మరణించాడు. దీంతో తన కొడుకుతో ఆమె ఒంటరి జీవితం గడుపుతోంది. అయితే ఒంటరిగా ఉండటం కష్టంగా మారిందని, అందుకే జయసుధ రెండో పెళ్లి చేసుకోబోతుందనే ప్రచారం సోషల్ మీడియాలో బలంగా జరుగుతోంది. అంతేకాదు ఆమె ఇప్పటికే సీక్రెట్ గా పెళ్లి కూడా చేసుకుందంటూ పోస్టులు పెడుతున్నారు.
ఈ క్రమంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై జయసుధ స్పందించింది. కొంతమంది కావాలనే తనపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని, తనపై ఎందుకు ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారో అర్ధం కావడం లేదని ఆవేదనకు గురయ్యారు. ఒంటరితనాన్ని పొగొట్టుకునేందుకు తాను సినిమాల్లో నటిస్తూ బిజీ అయ్యాయని జయసుధ క్లారిటీ ఇచ్చింది. ఇటీవల ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న బాలయ్య అన్స్టాఫబుల్ షోలో కూడా తన భర్త మరణంపై జయసుధ కన్నీళ్లు పెట్టుుకుంది.
జయసుధను బాలయ్య ఓదార్చి ధైర్యం చెప్పాడు. తాను అండగా ఉంటానని, బాధపడవద్దని జయసుధకు బాలయ్య ధైర్యం కల్పించాడు. జయసుధ తనకు మంచి ఫ్రెండ్ అని బాలయ్య చెప్పాడు. ఆ షోలో జయసుధ, జయప్రదతో బాలయ్య చేసిన కామెడీ అంతా ఇంతా కాదు. ఇద్దరు సీనియర్ హీరోయిన్స్ తో బాలయ్య అన్ స్టాఫబుల్ షోలో సందడి చేశాడు.