Jr NTR-Mahesh: త్రివిక్రమ్ సినిమా సమయంలో తారక్, మహేష్ అలాంటి బాధలు అనుభవించారా?

Jr NTR-Mahesh: టాలీవుడ్ ఇండస్ట్రీలో రచయితగా దర్శకుడుగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. ఈయన సినిమాలంటే అందరికీ సినిమాలపై అవగాహన ఉంటుంది. ఈయన దర్శకత్వంలో వచ్చే సినిమాలు ఎన్నో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. ఇకపోతే త్రివిక్రమ్ శ్రీనివాస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి స్టార్ హీరోలు అందరితోను సినిమాలు చేశారు.

ఈయనతో సినిమాలు చేసే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు తీవ్ర బాధలను అనుభవించారని తెలుస్తోంది.అసలు త్రివిక్రమ్ సినిమా వల్ల వీరు అనుభవించిన బాధ ఏంటి అనే విషయానికి వస్తే… 2018లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్టీఆర్ కాంబినేషన్లో అరవింద సమేత వీర రాఘవ అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.పూజా హెగ్డే ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకుంది.

ఇకపోతే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఎన్టీఆర్ తండ్రి సీనియర్ నటుడు దివంగత హరికృష్ణ గారు రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా హరికృష్ణ గారు రోడ్డు ప్రమాదం బారిన పడి మరణించారు. ఆ సమయంలో ఎన్టీఆర్ ఎంతో బాధను అనుభవించారు.ఇకపోతే ప్రస్తుతం ఇలాంటి బాధని మహేష్ బాబు కూడా అనుభవిస్తున్నారని తెలుస్తోంది.

మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఇదివరకే అతడు,ఖలేజా వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో ముచ్చటగా మూడోసారి మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా మొదటి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తికాగానే మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి అనారోగ్య సమస్యలతో మరణించారు. ఇలా మహేష్ బాబు తన తల్లి మరణంతో ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తానికి త్రివిక్రమ్ సినిమాలు చేసే సమయంలో ఈ ఇద్దరు హీరోలు వారి కన్నవారిని కోల్పోయి ఎంతో బాధను అనుభవించారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -