NTR: ట్యాగ్ మార్చుకున్న జూనియర్ ఎన్టీఆర్.. ఫ్యాన్స్ మీసం మెలేసేలా?

NTR: ఎన్టీఆర్ నట వారసుడిగా సినీ ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ఆపై అంచలంచెలుగా ఎదుగుతూ యంగ్ టైగర్ అనే ట్యాగ్ తో సినిమాలు చేస్తూ వచ్చాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ గా మారిన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఆ ట్యాగ్ ని మార్చుకున్నారు.

 

దేవర సినిమా టైటిల్ లో ఎన్టీఆర్ ట్యాగ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గా మారింది. ఈ పవర్ఫుల్ ట్యాగ్ అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే పవర్ఫుల్ టైటిల్ తో వస్తున్న దేవర సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. దేవర సినిమా కూడా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుంది.

తన డైరెక్షన్లో వచ్చిన ఆచార్య అట్టర్ ఫ్లాప్ కావడంతో ఈ సినిమాని ఎలాగైనా హిట్ కొట్టాలనే తపనతో ఉన్నాడు కొరటాల శివ. అయితే ఈ సినిమా మూవీ గ్లింప్స్ ని ఈ మధ్యనే రిలీజ్ చేశారు మూవీ మేకర్స్ ఈ గ్లింమ్స్ సినిమాలపై అంచనాలను అమాంతం పెంచేసింది. తారక్ ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. గ్లింప్స్ లో కనిపించిన తారక్ పవర్ఫుల్ యాక్షన్ చూసి ఫుల్ ఖుషి అవుతున్నారు ఆయన అభిమానులు.

 

సినిమాలో ఆయన చెప్పిన ఈ సముద్రం చేపల కంటే రక్తంతో తడిసిన కత్తులనే ఎక్కువగా చూసి ఉంటుంది అందుకే దీనిని ఎర్ర సముద్రం అన్నారు అన్న డైలాగ్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ బాబాయి బాలకృష్ణ గాడ్ ఆఫ్ మాస్ అయితే జూనియర్ ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ అని గర్వంతో మీసం మెలేస్తున్నారు నందమూరి అభిమానులు. రెండు భాగాలుగా వస్తున్న దేవర సినిమా తో జాన్వి కపూర్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తుండగా అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు.

Related Articles

ట్రేండింగ్

Election Campaigns: ఎన్నికల వేళ గరిష్టంగా రోజుకు 5,000 రూపాయలు.. కూలీలకు పంట పండుతోందా?

Election Campaigns: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారం చూస్తుంటే ఇవి అత్యంత ఖరీదైనవి గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఎన్నికల సమయంలో పార్టీ నాయకుల మీద అభిమానంతో స్వచ్ఛందంగా జనాలు...
- Advertisement -
- Advertisement -