NTR: నందమూరి తారకరత్నకు రాజకీయాల్లో రాణించాలని కల. కానీ కుప్పంలో యువగళం పాదయాత్రలో గుండెపోటుకు గురయ్యారు. అనంతరం చికిత్స పొందుతూ మరించారు. ఇప్పుడు ఆయన రాజకీయ డ్రీమ్ ను నెరవేర్చాలని భార్య అలేఖ్య రెడ్డి భావిస్తోందట. ఇందుకోసం వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు సన్నిహత వర్గాల నుంచి తెలిసింది.
విశ్వవిఖ్యాత నటులు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్ధాపించారు. ఆ పార్టీకి సేవ చేయాలని ఆయన మనవుడు తారకరత్న భావించారు. ఇందుకోసం కార్యాచరణను సిద్ధం చేసుకున్నారు. కార్యకర్తలతోనూ మమేకం అయ్యారు. పార్టీ పునర్ నిర్మాణం కోసం పాటు పడాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆయన కలలు అడి ఆశలై సమాధిగా మారిపోయాయి. కానీ భార్య అలేఖ్య ఆయన కోసం రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఇందుకు జూనియర్ ఎన్టీఆర్ కూడా సపోర్టు చేస్తున్నట్లు తెలిసింది.
తారకరత్న గుడివాడ నుంచి వచ్చే ఎన్నికల కోసం పోటీ చేస్తారన టీడీపీలో ప్రచారం నడిచింది. ఇప్పుడు అలేఖ్య రెడ్డి కూడా ఆ నియోజకవర్గం నుంచే పోటీ చేయనుందని టాక్. గతంలో టీడీపీకి అది పట్టున్న నియోజకవర్గం కూడా. ఇంకా చెప్పాలంటే ప్రస్తుత ఎమ్మెల్యే కొడాలి నాని కూడా టీడీపీ నుంచి అక్కడ ఎదిగిన వ్యక్తే. ఇప్పుడు ఆయన్ను ఢీకొట్టాలంటే అలేఖ్య రెడ్డినే కరెక్ట్ అని చంద్రబాబు నాయుడు సైతం భావిస్తున్నట్లు తెలిసింది. ఇక అన్న కోరిక నెరవేర్చేందుకు జూనియర్ సైతం అలేఖ్య రెడ్డి వెంట ప్రచారం చేస్తారని తెలిసింది.