KA Paul: జగన్మోహన్ రెడ్డిని శపిస్తానంటున్న కేఏ పాల్….!

KA Paul: కేఏ పాల్ ఈ వ్యక్తి గురించి పరిచయం అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఈయన గురించి అందరికీ తెలిసిందే. ప్రజాశాంతి పార్టీ పెట్టి రాజకీయాల్లో తిరుగుతూ ఉంటారు. తాను వస్తే ఒక్కొక్క నియోజకవర్గానికి 1000 కోట్లు ఖర్చు పెడతానంటూ మాట్లాడుతూ ఉంటారు. చాలామంది కేఏ పాల్ ను పాలిటిక్స్ లో కమెడియన్ గా చూస్తూ ఉంటారు. ఎక్కడ ఎలక్షన్ జరిగిన తాను నిలబడటం పట్టు తన అభ్యర్థులను నిలబెడుతూ ఉంటారు. హెలికాప్టర్ గుర్తుకు ఓటు వేయాలని చెబుతూ ఉంటారు. కనీసం పట్టుమని 10 ఓట్లు పడతాయో లేదో తెలియదు కానీ ఈసారి తామే అధికారంలోకి వస్తానంటూ చెబుతూ ఉంటారు.

 

రాజధాని సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసి ఎందుకు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ వద్దకు వచ్చారు. అయితే లోపలికి వెళ్లి ఎందుకు అనుమతి లేదు అంటూ పోలీసులకు కేఏ పాల్ ను అడ్డుకున్నారు. దాంతో కొద్దిసేపు అక్కడ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నేను జగన్మోహన్ రెడ్డిని కలవాలని, వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేద్దామని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తన వద్ద ఉన్న ప్రణాళికలు జగన్మోహన్ రెడ్డికి చెబుతాను అంటూ మాట్లాడారు. అయితే ఎంత ఎదురు చూసినా లోపలికి అనుమతించకపోవడంతో జగన్మోహన్ రెడ్డి తనకి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే శపిస్తానంటూ మాట్లాడారు.

అయితే గతంలో జగన్ మోహన్ రెడ్డి పైన విమర్శలు కూడా చేశారు. జగన్ తన పార్టీ జెండాను కాపీ కొట్టేసి తన పార్టీకి పెట్టుకున్నారని అన్నారు. అలాగే హెలికాప్టర్ గుర్తు ఉన్న ఫ్యాన్ గుర్తును కూడా కాపీ కొట్టి పెట్టారని విమర్శలు చేశారు. కేఏ పాల్ గత ఎన్నికల్లో భీమవరం నుండి పోటీ చేసిన సంగతి కూడా తెలిసిందే. ఈసారి కూడా తమ అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ మొత్తం నిలబెడతామని తాము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ ను అమెరికాల మారుస్తామంటూ కేఏ పాల్ చెప్పడం విశేషం.

Related Articles

ట్రేండింగ్

YSRCP: అయిదేళ్లలో మూడు రెట్లు పెరిగిన వైసీపీ నేతల ఆస్తులు.. మరీ ఇంత అవినీతిపరులా?

YSRCP: వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైకాపా నేతల అక్రమాలు మొదలయ్యాయి ఇష్టానుసారంగా చేతికి దొరికినది దోచుకుంటూ సొమ్ము చేసుకున్నారు. 2019 ఎన్నికల ముందు వరకు కనీసం ఆస్తిపాస్తులు లేనటువంటి వారు...
- Advertisement -
- Advertisement -