Kamalinee Mukherjee: గోదావరి హీరోయిన్ కమలినీ ముఖర్జీ గుర్తుందా? టాలీవుడ్ ప్రేక్షకులకు ఈమె సుపరిచయస్తురాలే. టాలీవుడ్లో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఈ అమ్మడు తర్వాత పలు కారణాలతో సినిమాలకు దూరమైంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మెరిసిన కమలిని.. మంచి సినిమాలతో దూసుకెళ్లింది. తనదైన మార్క్ నటనతో ఆకట్టుకుంది కమలినీ ముఖర్జీ. డైలాగ్ డెలివరీ, డ్యాన్స్లతో అదరగొట్టిన కమలిని.. తర్వాత తెరమరుగు కావడంతో ఆమె ఫ్యాన్స్ దిగాలుగా ఉన్నారు.
టాలీవుడ్లో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన తారలు.. ఉన్నట్టుండి సినీ అవకాశాలు తగ్గుముఖం పట్టి మాయమైపోతుంటారు. కానీ వారు నటించిన చిత్రాలు మాత్రం చరిత్రలో నిలిచిపోతుంటాయి. అలాంటి హీరోయిన్లలో కమలిని ముఖర్జీ కూడా చేరిపోయింది. కొన్ని సందర్భాల్లో వారి సినిమాలు చూసిన వారికి ప్రస్తుతం వారు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ పెరుగుతుంటుంది. ఈ క్రమంలో వారి గురించి నెట్టింట సెర్చ్ కూడా చేస్తుంటారు అభిమానులు.
2004లో దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్లో తెరకెక్కిన ఆనంద్ సినిమా రిలీజ్ అయ్యింది. ఈ మూవీలో హీరోయిన్గా నటించింది కమలిని ముఖర్జీ. తనదైన అందంతో కుర్రకారులో మంచి మార్కులు కొట్టేసింది కమలిని. తర్వాత టాలీవుడ్లో సినిమా అవకాశాలు విస్తృతంగా వచ్చాయి ఈ ముద్దుగుమ్మకు. వరుస హిట్లతో దూసుకెళ్లింది.
డల్లాస్లో మెరిసిన కమలిని..
తర్వాత తెలుగులో గోదావరి, హ్యాపీడేస్, గమ్యం, జల్సా లాంటి చిత్రాల్లో నటించి కెరీర్లో ఓ వెలుగు వెలిగింది కమలిని ముఖర్జీ. ఈ సినిమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆమె చివరగా రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన గోవిందుడు అందరివాడేలే మూవీలో నటించారు. తర్వాత ఇంత వరకు సినిమాల్లో దర్శనం ఇవ్వలేదు. అయితే, నటించింది తక్కువ సినిమాల్లోనే అయినా మంచి గుర్తింపుఉన్న పాత్రల్లో చేసింది కమలిని ముఖర్జీ. ప్రస్తుతం అమెరికాలో సెటిలయ్యింది ఈ అమ్మడు. సినిమాలకు దూరంగా ఉంటోంది. వ్యాపార రంగంలో మాత్రం రాణిస్తోందని తెలుస్తోంది. ఇటీవల యూఎస్లోని డల్లాస్లో జరిగిన ఓ ఈవెంట్లో సందడి చేసింది. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఏంటి ఇలా మారిపోయింది. ఆంటీలా తయారైంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.