Sandeep: సందీప్ సినిమాలో చేయనని తెగేసి చెప్పిన కంగనా.. ఏమైందంటే?

Sandeep: బాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గురించి మనందరికీ తెలిసిందే. గత నాలుగు ఐదు రోజులుగా సందీప్ రెడ్డి పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. ఎక్కువగా కాంట్రవర్సీలకు సంబంధించిన విషయాల్లోనే వార్తల్లో నిలుస్తున్నారు సందీప్ రెడ్డి వంగా. తాను దర్శకత్వం వహించిన యానిమల్ సినిమాపై విమర్శలు గుప్పించిన వారికి తనదైన శైలిలో ఘాటుగా స్పందిస్తూ వారిపై విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా ఇప్పటికే అర్జున్ రెడ్డి మూవీ రీమేక్ కబీర్ సింగ్ తో తన ఏంటో రుజువు చేసుకున్న సందీప్ యానిమల్ సినిమాతో సంచలనం రేపాడు. ఈ చిత్రం ఏకంగా రూ.900 కోట్ల వసూళ్లు సాధించింది.

 

నటుడిగా, ఒక స్టార్‌గా రణబీర్ కపూర్‌‌‌ను ఎలా వాడుకోవాలో చూపిస్తూ అతడికి కెరీర్లో ఎప్పటికీ నిలిచిపోయే సక్సెస్ ఇచ్చాడు సందీప్. అయితే ఈ సినిమాలో అనేక అంశాల మీద తీవ్ర వివాదాలు నడిచాయి. బాలీవుడ్ ఫిలిం సెలబ్రెటీలే చాలామంది ఈ సినిమా మీద విమర్శలు గుప్పించారు. జావెద్ అక్తర్ లాంటి లెజెండ్‌తో పాటు కిరణ్ రావు, కంగనా రనౌత్ ఇలా చాలామంది సినిమాలోని విషయాలను తప్పుబట్టారు. పురుషాధిక్యతను గ్లోరిఫై చేశారని మహిళల పాత్రలను కించపరిచేలా ప్రెజెంట్ చేశారని కంగనా లాంటి వాళ్లు సినిమాను విమర్శించారు. అయితే వీళ్లందరికీ సందీప్ రెడ్డి దీటుగానే బదులిచ్చాడు. నీ కొడుకు ఫర్హాన్ అక్తర్ తీసిన మీర్జాపూర్ సిరీస్‌లో సన్నివేశాల పరిస్థితి ఏంటి అంటూ జావెద్ అక్తర్‌కు ఇచ్చిన సమాధానం అయితే ఆయనకు దిమ్మదిరిగిపోయేలా చేసి ఉంటుంది.

తాజాగా కంగాన విషయంలో మాత్రం కాస్త సున్నితంగానే స్పందించారు సందీప్. ఆమె తన సినిమాను విమర్శించినప్పటికీ తనకు తగ్గ పాత్ర ఉంటే ఆమెకు ఆఫర్ చేస్తానని అన్నాడు. దీనికి కంగనా బదులిస్తూ.. సందీప్ సినిమాలో ఛాన్స్ ఇచ్చినా కూడా నేను నటించను అని తేల్చి చెప్పేసింది. సినిమాను విమర్శించడానికి, సమీక్షించడానికి తేడా ఉంది. యానిమల్ సినిమాపై నా రివ్యూను మీరు నవ్వుతూ చెప్పారు. అది మీకు నాపై ఉన్న గౌరవం అయి ఉండవచ్చు. కానీ మీ సినిమాల్లో నాకు ఎలాంటి పాత్రా ఇవ్వకండి. అలా ఇస్తే మీ ఆల్ఫా హీరోలు ఫెమినిస్టులు అవుతారు. అది మీకే ప్రమాదకరం. ఫిలిం ఇండస్ట్రీకి మీరు కావాలి అంటూ కాస్త వ్యంగ్యంగా స్పందించింది కంగనా.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -