Kangana Ranaut: బ్రేకప్ తో మంచి జరిగింది.. ఐదేళ్ల తర్వాత పెళ్లి.. కంగనా సంచలన వ్యాఖ్యలు వైరల్!

Kangana Ranaut: బాలీవుడ్ ఇండస్ట్రీలో కాంట్రవర్సీ క్వీన్ గా గుర్తింపు సంపాదించుకున్నటువంటి కంగనా ఏ విషయం గురించి మాట్లాడిన పెద్ద ఎత్తున వివాదాస్పదంగా మారుతూ ఉంటుంది. ఇలా ఈమె తరచు ఏదో ఒక విషయం గురించి మాట్లాడుతూ పోస్ట్ చేయడంతో ఆ విషయాలు పెద్ద ఎత్తున చర్చలకు కారణం అవుతూ ఉంటాయి. అయితే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొని తన బ్రేకప్ గురించి పెళ్లి గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా కంగనా నటించిన తేజస్ సినిమా అక్టోబర్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈమె తన బ్రేకప్ స్టోరీ గురించి కూడా మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎలాంటి సంబంధాలు అయినా ఎప్పుడూ కూడా ఒకే విధంగా ఉండవు. ప్రేమ విషయంలో అందరూ కూడా విజయం సాధించలేరు. నేను కూడా తెలిసి తెలియని వయసులో ప్రేమలో పడ్డాను. అయితే బ్రేకప్ జరిగి నాకు మంచే జరిగింది.

నా జీవితంలో లవ్ బ్రేకప్ జరగడం వల్ల నాకు మంచే జరిగింది. లేకపోతే ఇప్పటివరకు నేను ప్రేమలో ఉండి నా సమయం మొత్తం ప్రేమకే కేటాయించే దాన్ని అంటూ ఈమె తెలిపారు. లవ్ ఫెయిల్యూర్ వల్ల లాభాలు ఉంటాయి. అయితే ఆ లాభాలు ఏంటో చాలామందికి ఆలస్యంగా తెలుస్తాయని ఈమె తెలియజేశారు. ఇక పెళ్లి గురించి కూడా మాట్లాడుతూ పలు విషయాలను తెలియచేశారు.

పెళ్లి గురించి కంగనా ప్రతి ఒక్క అమ్మాయి తన పెళ్లి గురించి తన ఫ్యామిలీ పిల్లల గురించి కలలు కంటుంది. నేను కూడా కుటుంబ వ్యవస్థకు గౌరవం ఇస్తాను. నేను కూడా అందరిలాగే పెళ్లి చేసుకుని నాకంటూ ఒక ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటున్నాను పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహాన్ని చేసుకుంటానని ఈ సందర్భంగా ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -