Rishab Shetty: కాంతార హీరో ఆ టాలీవుడ్ హీరోయిన్‌ను ప్రేమించాడా?

Rishab Shetty: ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. ఇటీవల అలాంటి సినిమాల హవానే నడుస్తోంది. కన్నడ మూవీ కేజీఎఫ్ కూడా మొదట్లో ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయింది. కానీ పాజిటివ్ టాక్‌తో ఆల్‌ఓవర్ ఇండియానే షేక్ చేసింది. హీరో యష్ ఓవర్‌నైట్‌లోనే పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ఆ తర్వాత మౌత్ టాక్‌తో పాపులర్ అయిన సినిమా ‘కాంతార’. ఈ సినిమా మొదటగా కన్నడలో రిలీజ్ అయింది. అప్పుడు ఆల్‌ఓవర్ కన్నడలో బాక్సాఫీస్ బద్దలు కొట్టింది. సినిమాకు క్రేజ్ పెరగడంతో తెలుగు, హిందీ, తమిళం తదితర భాషల్లోనూ రిలీజ్ చేశారు. అక్కడ కూడా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నమోదైంది. తెలుగులో రూ.50 కోట్లుకుపైగా వసూలు చేయగా.. హిందీలో రూ.80 కోట్లకుపైగా వసూలు చేసింది. ఈ సినిమాకి దర్శకుడు, హీరోగా రిషబ్ శెట్టి వ్యవహరించాడు.

హీరో రిషబ్ శెట్టి డైరెక్టర్‌గా తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. అయితే ఇది అతనికి మొదటి సినిమా కాదు. గతంలోనూ కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించాడు. రక్షిత్ శెట్టి-రష్మిక మందనా హీరో హీరోయిన్లుగా నటించిన సూపర్ హిట్ మూవీ ‘కిరిక్ పార్టీ’. ఈ సినిమాకు రిషబ్ శెట్టి దర్శకత్వం వహించాడు. కన్నడలో ఈ సినిమా మంచి విజయం సాధించింది. అప్పుడే డైరెక్టర్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. కానీ యాక్టర్‌గా ‘కాంతార’ మూవీతో సక్సెస్ అయ్యాడు. అయితే త్వరలో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి రిషబ్ శెట్టి ఓ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి. రిషబ్ శెట్టి, ఎన్టీఆర్ తల్లి షాలిని ఇద్దరూ కర్ణాటకలోని కుందాపూర్‌కు చెందిన వారు. గతంలోనూ వీరి మధ్య మంచి బాండింగ్ ఉంది. అందుకే రిషబ్.. ఎన్టీఆర్‌తో కలిసి సినిమా చేయబోతున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

అయితే తాజాగా రిషబ్ శెట్టికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. రిషబ్ శెట్టి గతంలో ఓ హీరోయిన్‌తో లవ్ ట్రాక్ నడిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ హీరోయిన్ హరిప్రియతో రిషబ్ శెట్టి ప్రేమాయణం నడిపాడు. రిషబ్ శెట్టి-హరిప్రియ కలిసి ‘రిక్కీ’ అనే సినిమా చేశారు. ఆ సినిమా టైంలో ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారట. కానీ ఏమైందో తెలియదు.. సడెన్‌గా విడిపోయారట. ఆ తర్వాత రిషబ్ తన స్నేహితురాలు ప్రగతి శెట్టిని పెళ్లి చేసుకున్నాడు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -