Keerthy Suresh: కీర్తి సురేష్ ఆ విషయంలో వేస్టా.. ఏం జరిగిందంటే?

Keerthy Suresh: టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె మొదట నేను శైలజ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే యూత్ ని విపరీతంగా ఆకట్టుకోవడంతో పాటు మొదటి సినిమాతోనే విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది కీర్తి సురేష్. ఆ తరువాత తెలుగులో నేను శైలజ, నేను లోకల్, అజ్ఞాతవాసి, మహానటి, రంగ్ దే, సర్కారు వారి పాట వంటి సినిమాలలో నటించి మెప్పించింది.

కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ, మలయాళ సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇది ఇలా ఉంటే కీర్తి సురేష్ దసరా సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో మరో హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకుంది కీర్తి సురేష్. ఇది ఇలా ఉంటే తాజాగా కీర్తి సురేష్ కి సంబంధించి ఒక వార్త చెక్కర్లు కొడుతోంది. అదేమిటంటే.. కీర్తి సురేష్ కి మేకప్ వేసుకోవడం రాదట. అందుకే ఎక్కడికి వెళ్తున్నా సరే నేచురల్ గానే వెళ్లిపోతుందట. మొదటి నుంచి అదే తనకు ఎక్కువగా ఇష్టమట. తన అమ్మగారు కూడా మేకప్ లేకుండా ఉండడానికి ఇష్టపడుతుందట.

 

అయితే తెర పై సినిమాలో మాత్రం అది కంపల్సరీ కాబట్టి ఇష్టం లేకుండానే ఆ పని చేస్తుందట. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది కీర్తికీ మేకప్ వేసుకోవడం రాదా అని ఆశ్చర్య పోతున్నారు. ఇకపోతే కీర్తి సురేష్ సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న కీర్తి సురేష్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో చిరంజీవి చెల్లెలుగా నటిస్తోంది.. ప్రస్తుతం ఈ సినిమాలో నటిస్తూ బిజీబిజీగా ఉంది కీర్తి సురేష్. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -