Keerthy Suresh: కీర్తి సురేష్ కు బుద్ధి లేదా.. ఎన్టీఆర్ సినిమానే రిజెక్ట్ చేసి పెద్ద తప్పు చేసిందా?

Keerthy Suresh:  టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదట నేను శైలజ సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ ఆ తరువాత పలు సినిమాలలో నటించి హీరోయిన్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. మహానటి సినిమాతో ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాలలో బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది కీర్తి సురేష్. కానీ ఈ మధ్యకాలంలో కీర్తి సురేష్ నటించిన సినిమాలు అన్నీ కూడా డిజాస్టర్ లుగా నిలుస్తున్నాయి.

మరీ ముఖ్యంగా భోళాశంకర్ సినిమాతో డిజాస్టర్ హీరోయిన్ ఐరన్ లెగ్ అంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆ ట్యాగ్ చేయించుకొని మరి ట్రోలింగ్ కి గురవుతోంది. ఈ క్రమంలోనే కీర్తి సురేష్ గతంలో చేసిన తప్పులను మరోసారి ట్రెండ్ చేస్తున్నారు జనాలు. కీర్తి సురేష్ గతంలో ఎన్టీఆర్ సరసన ఒక సినిమాలో నటించే ఛాన్స్ వస్తే రిజెక్ట్ చేసిందట . అప్పట్లో కీర్తి సురేష్ కి ఎలాంటి సినిమాలు చూస్ చేసుకోవాలో తెలియదు. ఆ కారణంగానే తారక్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన జనతా గ్యారేజ్ సినిమాలో సెకండ్ హీరోయిన్గా ఛాన్స్ వస్తే కీర్తి సురేష్ తెలిసి తెలియని తనంతో రిజెక్ట్ చేసిందట.

కీర్తి ఆ పాత్రను రిజెక్ట్ చేయడంతో ఆ రోల్ నిత్యామీనన్ కి వెళ్ళింది. దీంతో ఎన్టీఆర్ కీర్తి సురేష్ కాంబోలో రావాల్సిన సినిమా మిస్ అయింది. ఒకవేళ ఆ సినిమాలో కాని అమ్మడు నటించి ఉంటే మాత్రం ఇప్పుడు కీర్తి సురేష్ ఎంతటి హై స్థానంలో ఉండేదో మనం ఊహించుకోవచ్చు. నిజంగా ఆ మూవీ అవకాశాన్ని మిస్ చేసుకోవడం కీర్తి సురేష్ బ్యాడ్ లక్ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఈ మధ్య కాలంలో కీర్తి సురేష్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటున్న విషయం తెలిసిందే. సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -