Kodali Nani: ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్, బీజేపీ పేరుకే ఇరు పక్షాలు మధ్య వైరం అని చాలామంది అనే మాట వైఎస్ఆర్సిపి పార్టీతో బిజెపి లో లోపలే ఒప్పందాలు కుదుర్చుకుంటూ బయటకు అలా కనిపిస్తారని చాలామంది భావిస్తున్నారు అయితే తాజాగా బిజెపి రాష్ట్ర ఇన్ ఛార్జ్ సునీల్ దేవధర్.. వైసీపీ నేతలు, అలాగే జగన్ సర్కారు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సునీల్ వైయస్ఆర్సీపీ నేత కొడాలి నాని పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు కొడాలి నాని వంటి వారిని జైలుకు పంపించాలి అంటూ ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు. గుడివాడ నియోజకవర్గ సమస్యలపై బిజెపి చార్జిషీట్ కార్యక్రమంలో మాట్లాడుతూ సునీల్ మాట్లాడుతూ.. జగన్ యూజ్ లెస్ గవర్నమెంట్ అంటూ మండిపడ్డారు.
కొడాలి నాని గాడిదల కుక్కల మాట్లాడుతూ ఫేమస్ అయ్యారని ఈయన మాట తీరు వల్ల ఏపీ పరువు పోతుందని ఈయన కామెంట్స్ చేశారు. ఈ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలతో మొదలుకొని జగన్ వరకు అందరూ దొంగలేనని, జగన్ మంత్రిమండలి అలీబాబా 40 దొంగలు లాగా తయారయ్యారని సునీల్ విమర్శించారు.
ఎక్కడైనా రోడ్లపై గుంతలు ఉంటాయి కానీ ఏపీలో మాత్రం గుంతల మీద రోడ్లు ఉంటాయి అంటూ ఈయన ఆంధ్రప్రదేశ్లోని రోడ్ల పరిస్థితిని గుర్తు చేస్తూ వ్యాఖ్యానించారు. ఏపీలో లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా, గంజాయి మాఫియా నడుస్తున్నాయనిసునీల్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు ఇలా వైసిపి నేతల గురించి సునీల్ ఈ స్థాయిలో కామెంట్ చేయడంతో ఈ వ్యాఖ్యలపై వైఎస్ఆర్సిపి నేతల రియాక్షన్ ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.