Balakrishna: లక్ష్మీపార్వతి షాకింగ్ కామెంట్స్.. బాలయ్యను అవమానిస్తూ?

Balakrishna: టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ, హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ ప్రధాన కార్యదర్శి అయిన నారా లోకేష్ పై తెలుగు సంస్కృతం అకాడమీ చైర్ పర్సన్‌ నందమూరి లక్ష్మీ పార్వతి సెటైర్స్ వేశారు. తాజాగా తిరుప‌తిలో ఆమె మీడియాతో ముచ్చటించారు. లోకేశ్‌ను ఏమీ రాని ద‌ద్ద‌మ్మ‌ అని, ఇక బాల‌య్య మాట్లాడితే ఆరు నెల‌లైనా అర్థం కాదు అంటూ ఆమె వెటకారంగా మాట్లాడింది. అంతేకాకుండా లోకేష్ యువగలం పాదయాత్రలో రోజుకో కామెడీ బాగుంటుంది అంటూ ఆమె వ్యంగంగా స్పందించింది.

తెలుగుదేశం పార్టీ రోజురోజుకు దిగజారి పోతుందని ఏమిరాని దద్దమ్మ ఒకచోట గెలవని వ్యక్తి సీఎం జగన్ ను విమర్శిస్తున్నారు అంటూ లక్ష్మీపార్వతి షాకింగ్ కామెంట్స్ చేసింది. త‌మ ప్రభుత్వ వైఫల్యాలను చెప్పలేక బూతులు తిట్టడమే పనిగా పెట్టుకున్నాడ‌ని లోకేశ్‌పై మండిపడింది. సోషల్ మీడియాలో పనికి మాలిన వెధవల్ని, కుక్కల్ని పోషిస్తున్నారని ఆమె తీవ్ర‌స్థాయిలో మండిపడింది. అంతేకాకుండా చంద్రబాబు ఒక సైకో అని పాపాలు పండిపోయాయని ఆమె తెలిపింది.

అంతేకాకుండా చంద్రబాబు ఆస్తి గురించి దుబాయ్, స్విట్జర్లాండ్ లో చంద్రబాబు ఐదు లక్షలు కోట్లు దాచి పెట్టారు అంటూ ఆమె సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. అనంతరం బాలకృష్ణ గురించి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే బాలకృష్ణ ఏం మాట్లాతారో ఆయ‌న‌కే తెలియ‌ద‌ని, బాల‌య్య మాట్లాడి ఆరునెలలు అయినా అర్థం కాదు అంటూ వెటకారంగా మాట్లాడింది. అనంతరం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ పవన్ చదువుతున్న పుస్తకాల జ్ఞానమంతా ఎక్కడికి పోయింది అని ఆమె నిలదీసింది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -