Laya: ఒకప్పటి సీనియర్ హీరోయిన్ లయ గురించి మా అందరికీ తెలిసిందే. ఈతరం ప్రేక్షకులకు లయ అంతగా తెలియకపోవచ్చు. కానీ ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది లయ. మొదటి చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ను ప్రారంభించిన ఆమె ఆ తర్వాత 1999లో విడుదల అయిన స్వయంవరం సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా కాస్త హిట్ అవడంతో ఈమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి. ఇక ఆమె2005 వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోయింది. ఇక ఆ తర్వాత ఆమె 2006లో అమెరికాలో డాక్టర్ అయిన గణేష్ గోర్తీ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బాయ్ చెప్పేసింది.
పెళ్లి తర్వాత అమెరికాలో సెటిల్ అయిన ఆమె కుటుంబ బాధ్యతలను చూసుకుంటూ బిజీబిజీగా మారిపోయింది. అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా తన అభిమానులను తెలుగు ప్రేక్షకులను పలకరిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన ఫ్యామిలీ గురించి స్పందిస్తూ.. ఒకసారి నేను అమెరికా వెళ్ళినప్పుడు ఒక ఆంటీ పెళ్లి ప్రస్తావన తెచ్చారు. మంచి సంబంధం ఉంటే చేసుకుంటానని చెప్పాను. తర్వాత ఇండియా వచ్చేశాను. నాలుగు నెలల తరువాత నాకు ఫోన్ కాల్ వచ్చింది. అన్ని విధాలా సంబంధం నచ్చడంతో గణేష్ గోర్తి ని వివాహం చేసుకున్నారు.
ఆయన వైద్య వృత్తిలో చాలా బిజీగా ఉంటారు. నేను కూడా కొన్నాళ్ళు ఐటీలో పని చేశాను. 2017 తర్వాత వదిలేశాను. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అమ్మాయి 9వ తరగతి చదువుతుంది. మా ఇద్దరినీ పక్కపక్కన చూస్తే మీ చెల్లెలా అని అడుగుతారు. తను కనీసం ఒక సినిమా చేస్తే చూడాలని ఉంది. అయితే నేను ఎవరినీ అవకాశం ఇవ్వమని అడగను. అమర్ అక్బర్ ఆంటోని చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది. అయితే తనని ఇండస్ట్రీకి వెళ్ళమని నేను బలవంత పెట్టను. ఇక అబ్బాయికి 12 ఏళ్ళు. ఇద్దరు పిల్లలు తెలుగు బాగానే మాట్లాడతారు. ఇంగ్లీష్ మాట్లాడటం వచ్చాక తెలుగు మర్చిపోయారు అంటూ లయ చెప్పుకొచ్చారు. కూతురు హీరోయిన్ అయితే చూడాలనే ఆశ లయ బయటపెట్టారు.