Nara Lokesh: కుంభకోణం బయట పెడుతా.. సీఎం జగన్‌కు డైరెక్ట్‌ వార్నింగ్‌ ఇచ్చిన లోకేష్‌

Nara Lokesh: వచ్చేవారంలో సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి కుంభకోణాన్ని బయటపెడుతానని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. మంగళగిరిలో తన సొంత ఖర్చులతో లోకేష్‌ ఆరోగ్య సంజీవని కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడారు.

పది పాసై, డిగ్రీ ఫైలైన తెలివితేటలే సీఎం జగన్‌వి అని ఎద్దేవా చేశారు. జగన్‌ చేస్తున్న అరాచకాలు ప్రజలకు తెలుస్తోందని త్వరలోనే జగన్‌ను ఇంటికి పంపే ప్రయత్నాల్లో ప్రజలు ఉన్నారన్నారు. జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన పరిశ్రమల కన్నా రాష్ట్రం నుంచి తరలిపోయేవి ఎక్కువగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే సీఎంవోతో వాటాపై చర్చ జరగుతోందని లోకేష్‌ ధ్వజమెత్తారు.

ప్రస్తుతం జగన్‌ మోహన్‌ రెడ్డి రిబ్బన్‌ కటింగ్‌ చేస్తున్న ప్రతి పరిశ్రమ తెలుగుదేశం హయాంలోనే పెట్టిందన్నారు. తెలుగు దేశం హయాంలో 5 లక్షల ఉద్యోగ కల్పన జరిగినట్లు స్వయంగా సీఎం జగన్‌ మోహన్‌రెడ్డే ఒప్పుకున్నారని ఆరోపించారు. దాదాపుగా 500 హామీలు ఇచ్చి విస్మరించిన జగన్‌ మోహన్‌రెడ్డిని 175 స్థానాల్లో ఎందుకు గెలిపించాలో ఒక్కసారి ప్రజలు ఆలోచించాలని హితువు పలికారు. ఈడీ,ఐటీ, సీబీఐకు భయపడుతున్న జగన్‌ ఢిల్లీలో మెడలు వంచి దండాలు పెడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్‌ను ఏ రంగంలో అభివృద్ధి చేశారో తెలుపాలన్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -