Nara Lokesh:ఎన్టీఆర్‌కు ధీటుగా లోకేష్ నిలబడగలడా?

Nara Lokesh: ఎన్టీఆర్ ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. 2009 ఎన్నికల్లో మాత్రమే ఎన్టీఆర్ కాస్త దూకుడుగా ప్రచారం చేశాడు. ఆ తరువాత చంద్రబాబు కూడా ఎన్టీఆర్‌ను పక్కన పెట్టేశాడు. అయితే యంగ్ టైగర్‌కు తత్వం బోధపడింది. రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చాడు. అమిత్ షా వచ్చి ఎన్టీఆర్‌ను కలవడంతో మరోసారి రాజకీయ ఎంట్రీ గురించి రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

తెలంగాణ, మరోవైపు ఏపీ రాజకీయాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీ గురించే చర్చ ఇంకా సాగుతూనే ఉంది. జూనియర్ ఎన్టీఆర్‌ను రాజకీయంగా దూరంగా ఉండాలని చంద్రబాబు తెగ ప్రయత్నించినట్టు అనిపిస్తుంది. ఎన్టీఆర్ వస్తే.. లోకేష్‌కు ఇబ్బంది అన్న సంగతి బాబుకు తెలుసు. అందుకే ఎన్టీఆర్‌ను వీలైనంత వరకు పాలిటిక్స్‌కు దూరంగా ఉంచాలని ట్రై చేస్తుంటాడు.

కానీ బాబు ఏం జరగకూడదని అనుకుంటున్నాడో అదే జరిగేట్టు కనిపిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే.. టీడీపీ తమ చేతుల్లోంచి చేజారడమే కాదు.. ఆ పార్టీకి అధినేతగా జూనియర్ ఎదుగుతాడని.. అతడే పార్టీకి వారసుడు అవుతాడని చంద్రబాబు, లోకేశ్ భయపడుతున్న విషయం తెలిసిందే. కానీ.. కేంద్ర మంత్రి జూనియర్ ఎన్టీఆర్ ను కలిసే సరికి.. ఇప్పుడు ఏం చేయాలి అనేదానిపై టీడీపీ అధినేత మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలుస్తోంది.

ఎన్టీఆర్‌కు రాజకీయాలపై ఆసక్తి ఉంది అని చెప్పడానికి 2009 ఎన్నికలే నిదర్శనం. టీడీపీలో చంద్రబాబు తర్వాత సమర్ధవంతమైన నాయకుడు ఎవరూ లేరని.. ఒకవేళ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే చంద్రబాబు తర్వాత పార్టీకి ఆయనే వారసుడు అవుతాడని.. టీడీపీ బాగుపడాలంటే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాల్సిందేనని పార్టీ శ్రేణులు ఎప్పటి నుంచో డిమాండో చేస్తున్నారు. కానీ.. చంద్రబాబు, బాలకృష్ణలకు ఎన్టీఆర్‌ను టీడీపీలోకి తీసుకోవడం ఇష్టం లేదని తెలుస్తోంది.

అమిత్ షా.. జూనియర్ ఎన్టీఆర్ ను కలవడంతో బీజేపీకి మద్దతుగా జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేస్తారా అనే దానిపై క్లారిటీ రావడం లేదు. నారా లోకేశ్‌ను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అంత సీన్ కూడా లోకేష్‌కు లేదు. దీంతో లోకేశ్‌ను హైలైట్ చేయడం కోసం.. లోకేశ్ పేరును తెరపైకి తీసుకురావడం వెనుక భారీ వ్యూహం కనిపిస్తోందట. జూనియర్ ఎన్టీఆర్‌ను అమిత్ షా కలిసిన తర్వాత.. లోకేశ్ కూడా అమిత్ షాతో రహస్యంగా భేటీ అయ్యాడట.

టీడీపీ, బీజేపీ పొత్తు కోసం అమిత్ షాను లోకేశ్ కలిశాడట. జూనియర్ పై సాగుతున్న ప్రచారాన్ని ముగించడం కోసం కావాలని లోకేశ్ పరపతిని పెంచడం కోసం ఈ ఎత్తుగడ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ లోకేశ్‌ను పైకి లేపాలనుకుంటే.. అమిత్ షాతో రహస్యంగా ఎందుకు భేటీ కావాల్సి వచ్చింది అని గుసగుసలు వినిపిస్తున్నాయి. లోకేశ్‌తో రహస్యంగా భేటీ అవ్వాల్సిన అవసరం అమిత్ షాకు ఏముంది అని కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ భేటి జరిగిందా? లేదా? అనేది పక్కన పెడితే.. ఎన్టీఆర్ విషయంలో టీడీపీ బాగానే జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎత్తుకు పైఎత్తు వేసేందుకు ప్రయత్నిస్తోంది. అమిత్ షాతో లోకేశ్ భేటీ విషయంపై బీజేపీ నేతలు మాత్రం ఎక్కడా కూడా ఏమీ మాట్లాడటం లేదు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -