Mahesh Babu: మహేష్ బాబును బీభత్సంగా వాడేస్తున్న జీ తెలుగు.. హర్ట్ అయినా అభిమానులు?

Mahesh Babu: టాలీవుడ్ ప్రేక్షకులకు సూపర్ స్టార్ మహేష్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇప్పటికీ చెక్కుచెదరని అందం మహేష్ బాబు సొంతం అని చెప్పవచ్చు. అలా సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రస్టార్ హీరోగా వెలుగుతున్నాడు.

కుర్ర హీరోలతో సమానంగా సినిమా ఆఫర్లు తన సొంతం చేసుకుని ప్రేక్షకులను ఒక రేంజ్ లో ఆకట్టుకుంటున్నాడు. ఇదిలా ఉంటే మహేష్ బాబు కొన్ని బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. మహేష్ బాబు వాల్యూ కు తగ్గట్టుగా బ్రాండ్ లకు గాను రెమ్యూనేషన్ కోట్ల రూపాయలతో వస్తుంది. ఇక ఇటీవల మహేష్ బాబు జీ నెట్వర్క్ సంస్థకి బ్రాండ్ అంబాసిడర్ గా మారారు.

దీనికోసం మహేష్ బాబు 9 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక జీ సంస్థ మహేష్ బాబును పొదుపుగా కాకుండా ఇష్టం వచ్చినట్లు వాడేసుకుంటుంది. ఇటీవల మహేష్ బాబు జీ ఛానల్ లో డాన్స్ షో కు తన కూతురు సితారతో కలిసి చీఫ్ గెస్ట్ గా పాల్గొన్నాడు. ఇలా పాల్గొనడం చాలా మంది హీరోలకు కామన్. కానీ మహేష్ బాబు అభిమానులకు ఇక్కడే సిగ్గుచేటుగా మారింది. త్వరలో విడుదల కాబోయే పడమటి సంధ్యారాగం సీరియల్ పోస్టర్ లో మహేష్ బాబు ఫోటో కూడా యాడ్ చేశారు.

ఇండస్ట్రీలో అగ్ర స్టార్ హీరోగా వెలుగుతున్న మహేష్ బాబుని ఆ సీరియల్ యాక్టర్ ల పక్కన వేయడం ఏమిటి అని మహేష్ బాబు ఫ్యాన్స్ ఫీలవుతున్నారట. టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ సీరియల్ ప్రమోషన్ లో భాగం కావడం ఏమిటని తన అభిమానులు అవమానకరంగా ఫీల్ అవుతున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే ఈ పోస్టర్ పై ఒక రేంజ్ లో ట్రోల్స్ నడుస్తున్నాయి. ఈ ట్రోల్స్ చూసిన ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులు ఏమాత్రం తీసుకోలేకపోతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -