Mahesh Babu: ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో మహేష్ సినిమా రికార్డ్..!

Mahesh Babu: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఇప్పుడంతా రీ రిలీజ్ ల హంగామా నడుస్తోంది. టాలీవుడ్ లో ఈ మధ్యనే ఖుషి సినిమా రీ రిలీజ్ అవ్వడంతో పవన్ ఫ్యాన్స్ అంతా ఆనందం వ్యక్తం చేశారు. తాజాగా మహేష్ బాబు ఒక్కడు సినిమా కూడా రీ రిలీజ్ అయ్యింది. జనవరి 7వ తేదీన మహేష్ బాబు సినిమా ఒక్కడు రీ రిలీజ్ అవ్వడంతో ఫ్యాన్స్ సందడి చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రీ రిలీజ్ అయ్యింది.

 

ఈ తరుణంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో మహేష్ స్టామినా ఏంటో మరోసారి బయటపడింది. రీ రిలీజ్ లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో మహేష్ ఒక్కడు సినిమా రికార్డ్ కలెక్షన్స్ సాధించడం విశేషం. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని థియేటర్ లో మహేష్ ఒక్కడు సినిమా 16.93 లక్షలు ఒక్కరోజులో కలెక్ట్ చేసి చరిత్ర నెలకొల్పినట్లు సమాచారం. ఇప్పటివరకు రీ రిలీజైన ఏ మూవీకి కూడా ఇంత మొత్తంలో డబ్బులు రాలేదు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఇంత వరకూ ఆ వసూళ్లను ఏదీ బీట్ చేయలేదు. దీంతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర సూపర్ స్టార్ మహేష్ స్టామినా ఏంటో తెలిసిందని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

 

ఎమ్మెస్ రాజు నిర్మించిన ఒక్కడు సినిమాను డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించారు. సినిమాలో మహేష్ కబడ్డీ ఆటగాడిగా కనిపించి భూమిక ప్రేమలో పడుతాడు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతాన్ని అందించారు. సినిమాలో ప్రతి అంశం చాలా పర్ఫెక్ట్ గా రావడంతో మహేష్ కెరీర్ లోనే ఇదొక అద్భుత సినిమాగా నిలిచిపోయింది. చాలామంది డైరెక్టర్లు కావాలనుకునేవారికి కూడా ఈ సినిమా ఒక మార్గదర్శకంగా నిలిచింది.

 

ఒక్కడు సినిమాకు ముందు మహేష్ బాబు ఫ్యామిలీ హీరోగా కొనసాగేవారు. ఒక్కడు సినిమా తర్వాత ఆయన రేంజ్ మారిపోయింది. ఈ సినిమాతో మాస్ ఇమేజ్ ను మహేష్ బాబు సొంతం చేసుకున్నాడు. మహేష్, భూమికల జోడీ కూడా ఈ సినిమాకు బాగా కుదిరింది. ఈ సినిమా కోసం తోట తరణి వేసిన సెట్స్ అప్పట్లో చాలా ఫేమస్ అయ్యాయని చెప్పొచ్చు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -