Mahesh: యాభై రూపాయలకే వీడియో.. ఇలాంటి వ్యక్తుల వల్లే సూపర్ స్టార్ మహేష్ పరువు పోతుందా?

Mahesh: కొందరు జీవితంలో కష్టపడి ఏదో ఒకటి సాధించి పైకి ఎదగాలనుకుంటారు కానీ చాలామంది తప్పు తోవ అయినా పర్వాలేదు ఈజీగా సెటిల్ అయిపోవాలి అనుకుంటారు. అందుకోసం వాళ్ళు ఎలాంటి పనులు చేయడానికి అయినా సిద్ధపడతారు. ఇప్పుడు అలాంటి వాడే ఒకడు పోలీసులకు చిక్కి జైలు పాలు అయ్యాడు. ఈజీ మనీకి అలవాటు పడిన ఒక వ్యక్తి అమ్మాయిల ఫోటోలతో మార్ఫింగ్ వీడియోలు చేసి అమ్మడం మొదలుపెట్టాడు.

వీడియోలను ట్విట్టర్లో 50 రూపాయలకే అమ్ముతుండడానికి పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. ఇక అసలు విషయంలోకి వస్తే భూక్య రమేష్ అనే వ్యక్తి మహిళల మార్ఫింగ్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసేవాడు. ట్విట్టర్ హ్యాండిల్ లో అసభ్యకరంగా వీడియోలను షేర్ చేసేవాడు. ఒక్కొక్క మార్ఫింగ్ వీడియోను 50 రూపాయలకు విక్రయించి సొమ్ము చేసుకునేవాడు.

అలాగే ఫుల్ వీడియో కావాలంటే ఒక నెంబర్ కి ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ పెడితే చాలని నెటిజన్లను నమ్మించాడు. దీంతో చాలామంది రమేష్ అకౌంట్లో డబ్బులు వేశారు. ఈ తతంగం అంతా చూసిన ఒక వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో ఆ వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి భూక్య రమేష్ ను అదుపులోకి తీసుకున్నారు. మహిళలపై అసభ్యకరమైన మార్ఫింగ్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని మరికొందరు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.

ఈ నేపథ్యంలో ఐపిసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద భూక్య రమేష్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇప్పుడు రమేష్ కటకటాలు లెక్క పెడుతున్నాడు. అయితే రమేష్ సినీ నటుడు మహేష్ బాబు కి పెద్ద ఫ్యాన్. ఈ వింగ్లో అతగాడికి మంచి గుర్తింపు ఉంది. ఇప్పుడు అవన్నీ పోయి వేరే విధంగా తానే వైరల్ అయిపోయాడు. అయితే ఇలాంటి ఫ్యాన్స్ వల్ల మహేష్ బాబు కి పరువు పోతుంది అంటూ యాంటీ మహేష్ ఫ్యాన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -