Mahesh: మహేష్ బాబు తల్లి కోరిక మేరకు సితార విషయంలో అలా చేయనున్నారా.. ఏం జరిగిందంటే?

Mahesh: మహేష్ బాబు కుమార్తె సితార గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఈమె వయసు 11 సంవత్సరాలు అయినా సరే చాలా యాడ్లు చేస్తూ చాలా పాపులారిటీని తెప్పించుకుంది. అయితే గత ఏడాది ఒక నెల క్యాప్ లోనే మహేష్ తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తన తల్లి ఇందిరాదేవి బతికున్నప్పుడే తన కళ్ళతో సితార వోనిల ఫంక్షన్ చూడాలని ఆశపడిందట.

కానీ అకాల మరణం చెందడంతో తన ఆశ నెరవేరలేదు. అందుకే వాళ్ళ మాసికం అయిన తరువాత మహేష్ కూతురు సితారకి ఓణీల ఫంక్షన్ చేద్దామని అనుకుంటున్నాడట. దీనికోసం పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, సినీ విశ్లేషకులని పిలవకపోయినా సరే తన ఘట్టమనేని కుటుంబాన్ని అక్కాచెల్లెళ్ల కుటుంబాలని పిలిచి గ్రాండ్ గా సెలబ్రేట్ చేద్దామని అనుకుంటున్నారట.

తన తల్లి ఇందిరాదేవి కోరికని ఈ విధంగానైనా నెరవేరుద్దాము అని అనుకుంటున్నారు మహేష్. అయితే సితార గురించి మనకు తెలిసిందే తను ఈ వయసులోనే పెద్ద ఆడ్స్ చేస్తూ డబ్బులు సంపాదించి తన ఉదారమైన మనసుతో వాటిని చారిటీలకు ఇచ్చేస్తుంది. తండ్రి అడుగు జాడల్లోనే కూతురు కూడా నడిచి ఇప్పటినుంచి దానాలు చేస్తుంది తండ్రి పోలికలే వస్తున్నాయి అని సితారని అభిమానులందరూ పొగుడుతూ ఉన్నారు.

అందరి ప్రశంసల్ని అందుకుంటూ సితార అందరి మనసులలో చోటు గెలుచుకుంది. ఇంక తను పెద్దయ్యాక ఎప్పుడు స్టార్ హీరోయిన్ అవుతుందా సినిమాల్లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందా అని మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు గుంటూరు కారం షూట్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గరికి వస్తుంది కనుక ఇంక అప్డేట్స్ రిలీజ్ చేసే పనిలో ఉన్నారు. సాంగ్ రిలీజ్ కూడా త్వరలోనే ఉండబోతుంది అని దసరా రోజు చెప్పారు ఈ చిత్ర బృందం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -