Mahesh-Pawan: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల మధ్య సినిమాల పరంగా పోటీ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. సినిమాల విషయంలో వార్ నడిపించినా.. వ్యక్తిగతంగా వీరందరూ మంచి స్నేహితులు. ఇండస్ట్రీ పరంగా, ఫ్యామిలీపరంగా ఏ ఆపద వచ్చినా.. ఒకరికొకరు అండగా నిలబడుతూ ఆదుకుంటుంటారు. అలాగే ఒకరికొకరు సినిమాల్లో తమ వాయిస్ ఇస్తూ.. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంటారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. వీరిద్దరి ఫ్యామిలీ కూడా సినీ ఇండస్ట్రీలోనే కొనసాగుతున్నారు. సాధారణంగా పవన్, మహేశ్ ఇద్దరు కైండ్ హార్టెడ్ పీపుల్స్. ఎవరికేం ఆపద వచ్చినా.. ఇద్దరూ తమవంతూ సాయం చేస్తూనే ఉంటారు. తాజాగా మహేశ్ బాబుపై పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి.
‘అర్జున్’ సినిమా విడుదలైనప్పుడు పైరసీకి వ్యక్తిరేకంగా మహేశ్ బాబు పోరాటం చేశాడని పవన్ కళ్యాణ్ చెప్పాడు. అప్పుడు మహేశ్ బాబుకు మద్దతుగా సినీ ఇండస్ట్రీ మొత్తం అండగా నిలిచిందన్నారు. టాలీవుడ్ పరిశ్రమను కాపాడుకునేందుకు అందరూ నడుం బిగించామన్నారు. అప్పుడు తాను కూడా మహేశ్ బాబు వెన్నంటే ఉన్నానని పవన్ చెప్పుకొచ్చాడు. కాగా, పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘జల్సా’ సినిమాలో మహేశ్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చారు. హీరో సంజయ్ సాహూను ఇంట్రడ్యూస్ చేస్తూ మహేశ్ బాబు వాయిస్ అందించారు. ఈ సినిమా మంచి హిట్ అందుకుంది. అయితే ఈ విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. హీరో పాత్ర పరిచయానికి మహేశ్ బాబు వాయిస్ ఇస్తే బాగుంటుందని డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అనుకున్నారు. ఆ విషయాన్ని మహేశ్ బాబుకు చెప్పడంతో వెంటనే ఓకే చెప్పిన గొప్ప మనసు అతడిదని పవన్ కళ్యాణ్ తెలిపారు. కాగా, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ బిజీలో ఉన్నారు. ఇటీవలే మహేశ్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మరణించడంతో.. కొద్దిరోజులపాటు ఆయన షూటింగ్లకు దూరంగా ఉన్నారు.