YuvaShakthi: ఛీ నా బతుకు చెడ.. వైసీపీపై పవన్ సంచలన వ్యాఖ్యలు!

YuvaShakthi: కొందరు ఏపీని మూడు ముక్కలు చేసే కుట్రలు చేస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రణస్థలం వేదికగా జనసేన పార్టీ యువశక్తి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైసీపీ సర్కార్ పై ఫైర్ అయ్యారు. మనల్ని‌ఎవడ్రా ఆపేది అంటూ తన ఉపన్యాసాన్ని ప్రారంభించిన పవన్ తనపై విమర్శలు చేసే ప్రతి ఒక్కరికీ కౌంటర్ ఇచ్చారు. తాను గెలుస్తానో ఓడిపోతానో కాదని, తనకు పోరాటమే తెలుసని, వెధవల్ని ఎదుర్కోవడం, గూండాలను‌ తన్నడం తనకు బాగా తెలుసని పవన్ కళ్యాణ్ తెలిపారు.

ఏపీది మూడు ముక్కల ప్రభుత్వమని, సీఎం జగన్ మూడు ముక్కల ముఖ్యమంత్రి అంటూ పవన్ సెటైర్ వేశారు. ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడే పంచెలు ఊడిపోయేలా తరిమి కొట్టండని తాను గతంలో చెప్పినట్లు గుర్తు చేశారు. తనను భయపెట్టాలని చూసినా, దాడులు చేసినా భయపడేది లేదని తెలిపారు. ఇంకోసారి ప్యాకేజీ అంటే జనసైనికుడి చెప్పు తీసుకుని కొడతానని, తాను బతికున్నంత వరకు వైసీపీ గూండాలతో యుద్ధం చేస్తానని వెల్లడించారు.

తన గురించి మాట్లాడే వాళ్లను ఒక్కర్ని కూడా మర్చిపోనని, తన వాళ్లూ మర్చిపోరని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. తాను కులంకోసం వచ్చినవాడ్ని కాదని, తెలుగు నేల, దేశం బాగుండాలనే రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. జైలుకెళ్లిన ఖైదీ నెంబర్ 6093 కూడా తన గురించి మాట్లాడితే ఎలా అంటూ పవన్ కళ్యాణ్ సెటైర్లు వేయడంతో జనసైనికులు నినాదాలు చేశారు.

రాజు సరైనోడు కాకపోతే సగం రాజ్యం నాశనమువుతుందని, సలహాలిచ్చేవాడు సజ్జల అయితే పూర్తిగా సర్కార్ నాశనం అవుతుందని పవన్ విమర్శించారు. మంత్రులపైనా తనదైన రీతిలో కౌంటర్ పవన్ కౌంటర్లు వేశారు. డైమండ్ రాణి అంటూ రోజాను, సంబరాల రాంబాబు అంటూ అంబటి రాంబాబును తన సెటైర్లతో పవన్ చెడుగుడు ఆడుకున్నారు. ఐటీ మంత్రి పేరెత్తేందుకు కూడా అసహ్యం వేస్తోందని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -