MaheshBabu: నెలల వ్యవధిలోనే తల్లి, తండ్రి, సోదరుడిని కోల్పోయి మహేష్ బాబు తీవ్ర విచారంలో మునిగిపోయారు. సన్నిహితులను కోల్పోతేనే నిబ్బరంగా ఉండలేని మనుషులున్న ఈ కాలంలో.. సొంత కుటుంబీకులను కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవించేవారికి మాత్రమే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మహేష్ బాబుకు గుండె నిబ్బరం కలిగించాలని ఆ దేవుడిని అభిమానులు కోరుకుంటున్నారు. జన్మనివ్వడంతోపాటు అశేష జనవాహినిని, లక్షలాది అభిమానగణాన్ని సంపాదించి ఇచ్చారు సూపర్ స్టార్ కృష్ణ.
ప్రస్తుతం తీవ్ర భావోద్వేగంతో ఉన్న మహేష్పై అనేక బాధ్యతలు పడ్డాయి. కుటుంబ పెద్దగా, అశేష అభిమానులకు సూపర్ స్టార్గా పెద్దన్న పాత్ర పోషించాల్సి ఉంది. ఇటీవల త్రివిక్రమ్ శ్రీనివాస్తో చేస్తున్న సినిమా ఇప్పటికే పలు కారణాల వల్ల వాయిదా పడుతోంది. మంచి హిట్ అందించాలని ఇద్దరూ పరితపిస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో అతడు, ఖలేజా లాంటి హిట్ మూవీస్ వచ్చాయి. వాటిని మరిపించేలా మూవీ తీయాలని అనుకుంటున్నారు.
ఈ నేపథ్యంలోనే వరుస విషాదాలు, తన వాళ్లను కోల్పోవాల్సి వచ్చింది మహేష్ బాబు. ఈ కారణంగా సినిమాలు ఆలస్యం అవుతాయని భావిస్తున్నారు. కానీ మహేష్ ఆలోచనా ధోరణి అలా ఎన్నటికీ ఉండదని అభిమానులు చెబుతున్నారు. తన మీద కోట్లాది అభిమానుల ఆశలు, పెట్టుబడిదారుల నమ్మకాలు ఉన్నాయని, వాటిని తప్పక నెరవేర్చాలనే తపన మహేష్కు ఉందంటున్నారు.
ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలి..
ఇక త్రివిక్రమ్తో మూవీ తర్వాత రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ప్రాజెక్టు ఉండబోతోంది. అది ఫ్యాన్స్లో భారీ అంచనాలకు దారి తీస్తోంది. ఈ నేపథ్యంలో కుటుంబంలో నెలకొన్ని విషాదాన్ని తట్టుకొని మహేష్ మూవీల్లో వీరోచితంగా నటించాల్సి ఉంది. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటూ నటనపై ప్రభావం పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మహేష్పై ఉంది.