Uttar Pradesh: పెళ్లంటే నూరెళ్ల పంట అంటారు పెద్దలు. ఒకరికొకరు తెలియని వారు పెళ్లితో ఒక్కటై జీవితాంతం కలిసి కష్టసుఖల్లో పాలు పంచుకుంటారు. కానీ.. పెళ్లయిన మూడవ రోజుకే ఆ పెళ్లి కొడుకు తనకు విడాకులు కావాలని పోలీసులను ఆశ్రయించిన ఘటన ఉత్తర్ప్రవేశ్లో చోటు చేసుకుంది. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో కొత్తగా పెళ్లయిన ఓ జంటకు రాత్రి శోభనం ఏర్పాటు చేశారు. అందులో భాగంగా శోభన గదిని పూలు, పండ్లతో అలంకరించారు. అంతోనే శోభనం సమయం కానే వచ్చింది. అంతా సిద్ధం చేసినా బంధువులు వధూవు, వరుడిని శోభనం గదిలోకి పంపారు. వధువు పాల గ్లాస్తో లోపలికి రాగానే వరుడు పట్టలేనంత ఆనందంగా ఆమె దగ్గరికి వెళ్లాడు.
కానీ పాపం ఓ వ్యక్తికి ఆమె మొదటి రాత్రే కాలరాత్రి చూపించింది. ఒక్కసారిగా అరుపులు కేకలు వేస్తూ బటయకు పరుగులు తీశాడు.ఈ భార్యతో నేను వేగలేను బాబోయ్ అంటూ ఏకంగా పోలీసులనే ఆశ్రయించాడు. ఇంతకు వారి మొదటి రాత్రిలో జరిగిన పరిణామాలేంటో తెలుసా.. బంధువుల సమక్షంలో పెళ్లి చేసుకున్న ఓ జంట. శోభనానికి సిద్ధమయ్యారు. ఇక స్వీట్స్, పూల, పండ్లతో అందంగా గదిని అలంకరించుకొని, మొదటి రాత్రిని సరదాగా గడుపుదామనుకున్నారు.
తన భార్య గదిలోకి రావడంతో.. భర్త ఎంతో ఉత్సాహంతో ఏదో చేద్దాం అనుకున్నాడు.. కానీ పాపం ఏం చేయలేక పోయాడు. ఇలా రెండు రోజులు అతనికి నిరాశే ఎదురైంది. ముచ్చటగా మూడో రోజు ఎలాగైనా భార్యతో ఏంజాయ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. భార్య గదిలోకి రావడంతో దగ్గర తీసుకున్నాడు.. కానీ ఆమె ఒక్కసారిగా తన విశ్వరూపాన్ని బటయపెట్టింది.
భర్త అని చూడకుండా ఎక్కడ బడితే అక్కడ కొరకడం మొదలు పెట్టింది. ఈ దెబ్బలకు అతగాడు అరుపులు పెట్టాడు. బెడ్రూమ్ నుంచి వింత వింత శబ్దాలు ఉన్నా కుటుంబ సభ్యులు ఏమైందోనని ఆ గదివైపు వెళ్తుండగా ఒక్కసారిగా బెడ్రూమ్ గది తలుపులు తెరుచుకుని వరుడు పరిగెత్తుకొచ్చాడు. ఈమెతో కాపురం చేయడం కష్టమంటూ బంధువులకు తేల్చిచెప్పేశాడు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లి జరిగిన ఘటనపై ఫిర్యాదు చేశారు.