Manjula Ghattamaneni: తెలుగు సినీప్రియులకు సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరి ఘట్టమనేని మంజుల గురించి పెద్దగా పరిచయంకర్లేదు. ఆమె తెలుగు సినిమాల్లో నటించింది. నటిగానే కాకుండా నిర్మాతగా పలు సినిమాలను నిర్మించింది. 1999 లో రాజస్థాన్ అనే సినిమాలో నటించడం తో మంజుల తెలుగు తెరకు పరిచయమైంది. మలయాళం లో సమ్మర్ ఇన్ బెత్లెహెం అనే సినిమాలో మంజుల హీరోయిన్ గా నటించింది.
ఈ సినిమాకు జాతీయ స్థాయి పురస్కారంను తన సొంతం చేసుకుంది మంజుల. ఇక తన సోదరుడు మహేష్ బాబు నటించిన నాని, పోకిరి వంటి సినిమాలకు మంజుల నిర్మాతగా వహించింది. ఇలా మంజుల టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. ఇదంతా పక్కన పెడితే తాజాగా సూపర్ స్టార్ కృష్ణ గారి భార్య మంజుల తల్లి అనారోగ్యం కారణంగా మరణించారు. ఇక ఇందిరా దేవి గారి మరణ వార్త విని సినీ, రాజకీయ పెద్దలు కృష్ణ కుటుంబాన్ని పరామర్శించడానికి బయలుదేరుతున్నారు.
ఇందిరా దేవి గారు మరణించడంతో సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో మంజుల కూడా ఎమోషనల్ అయ్యి సోషల్ మీడియా లో ఒక పోస్ట్ షేర్ చేసింది. మీరే నా మొదటి గురువు, నా పునాది, నా హృదయం, మీ ప్రేమ నా రక్షణ కవచం, మీరే నా జీవితానికి స్ఫూర్తి. మా అమ్మకు తెలిసింది కేవలం ఇవ్వడం మాత్రమే తనకోసం ఏమీ అడగకుండా తన జీవితం మొత్తాన్ని అలానే చేసారు.
నా చిన్నతనంలో మా అమ్మ లేకుండా ఒక్కరోజు కూడా గడిపింది లేదు. ఆమె ఎలాంటి స్వార్థం లేకుండా మా అవసరాలన్నీ చూసుకునేవారు. ఆమెకు పరిచయం ఉన్నవారు ఎవరైనా ప్రేమతో పలకరించేవారు. ఆమె చమత్కారి, అంతేకాకుండా ఆమె చాలా అందంగా నవ్వే వారు అని మంజుల ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో తన తల్లి గురించి ఎమోషనల్ కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Dear Mom,
You are my first Guru, my foundation and my heart. Your love has been my protection. You are the biggest influence in my life.
I love you very much. Love and prayers on your further journey ❤❤❤! pic.twitter.com/ryTOELElky
— Manjula Ghattamaneni (@ManjulaOfficial) September 28, 2022