Tamil Nadu: 7 నెలల కిందటే పెళ్లి.. సంతోషంగా ఉన్నారనుకుంటే.. చివరికి?

Tamil Nadu: ఇటీవల కాలంలో భార్యాభర్తల మధ్య గొడవలకు ఎవరో ఒకరు బలవుతున్నారు. చిన్న చిన్న గొడవలే ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకోవడం వరకు వెళ్తున్నాయి. కొంతమంది భార్యాభర్తలు క్షణికావేశంలో ఊహించని నిర్ణయాలు తీసుకొని పిల్లలను కూడా చంపేస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది పిల్లలు భార్యాభర్తల మధ్య గొడవలకు బలయ్యారు. రెప్పపాటు కాలంలో ఊహించని విధంగా నిర్ణయాలు తీసుకొని చంపి చేజేతులా జీవితాలను నాశనం చేసుకొని కటకటాల పాలవుతున్నారు. తాజాగా కూడా అటువంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది.

నవ దంపతుల మధ్య గొడవ చివరికి చావు వరకు దారితీసింది. అసలేం జరిగిందంటే.. తమిళనాడులోని శ్రీనగర్ ప్రాంతంలో శ్యామ్ అనే 26 ఏళ్ల వ్యక్తి అతని జనిలా దంపతులు నివసిస్తున్నారు. వీరికి 7 నెలల కిందటే పెళ్లి కూడా అయ్యింది. కాగా భర్త శ్యామ్ స్థానికంగా ఉండే ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇక పెళ్లైన తర్వాత దంపతులిద్దరూ సంతోషంగానే ఉన్నారు. వారికి కాపురం కూడా సజావుగా సాగుతూ వచ్చింది. కొద్ది రోజులుగా కుటుంబాల మధ్య కలహాలు మొదలయ్యాయి.

దాంతో ఆ నవ్వు దంపతులు ఎడ మొహం పెడ మొహం అన్నట్లుగా ఉండేవారు. ఈ క్రమంలోనే తాజాగా ఇద్దరు మరోసారి గొడవపడ్డారు. ఒకరిపై ఒకరు మాటల్లో దాడి చేసుకోగా కోపంతో ఊగిపోయిన భర్త శ్యామ్ భార్యని కత్తితో దారుణంగా పొడిచాడు. అత్తమామలు అడ్డు రావడంతో వారిపై కూడా కత్తితో దాడి చేశాడు. ఆ దాడిలో భార్య తీవ్రంగా గాయపడడంతో వెంటనే ఆమె తల్లిదండ్రులు జనిలా ను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తాజాగా ప్రాణాలు విడిచింది. పెళ్లయి అత్తారింట్లోకి అడుగుపెట్టిన కూతురు పెళ్లి అయ్యి కనీసం ఏడాది కూడా పూర్తికాకముందే అలా కనిపించడంతో తల్లిదండ్రులు గుండెలు విలసేలా రోదిస్తున్నారు. అనంతరం జనిలా తల్లిదండ్రులు అల్లుడు శ్యామ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును చేపట్టారు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -